ఓవైపు రైతు,పేదలు-మరోవైపు కుళ్లు,కుతంత్రాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఓవైపు రైతు,పేదలు-మరోవైపు కుళ్లు,కుతంత్రాలు

ఓవైపు రైతు,పేదలు-మరోవైపు కుళ్లు,కుతంత్రాలు

Written By news on Friday, April 6, 2012 | 4/06/2012

రామచంద్రాపురంలో జరిగే పోటీ ఇద్దరి వ్యక్తులు, రెండు పార్టీల మధ్య జరిగే పోటీ కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. ఇక్కడ పోటీలో రైతన్న, పేదవాడు ఒకవైపున ఉంటే, కుళ్లు, కుతంత్రాలు మరోవైపున ఉన్నాయని చెప్పారు. ఎర్రపోతవరంలో మహానేత వైఎస్ఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. రామచంద్రపురం ప్రజలు వేసే ప్రతి ఓటు రైతన్నకు, పేదవాడికి వేసేదే అన్నారు. ప్రజలు వేసే ప్రతి ఓటు రాష్ట్ర పాలకుల కళ్లు తెరిపించాలన్నారు. ప్రజల కోసం పదవి త్యాగం చేసిన బోస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జగన్‌ను చూసేందుకు ఊరంతా కదిలివచ్చింది.


రామచంద్రపురం నియోజకవర్గం అంతటా జగన్ పర్యటిస్తున్నారు. కూనిమిల్లిపాడు గ్రామానికి వెళ్లగానే జనమంతా నడిరోడ్డుపైకి తరలివచ్చారు. మహానేత బిడ్డకు ఆత్మీయ స్వాగతం పలికారు. దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహాన్ని జగన్‌ ఆవిష్కరించారు. గ్రామస్తులకు వినయపూర్వకంగా అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.
Share this article :

0 comments: