వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని చూసి ఎందుకు భయపడుతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు టిడిపి, కాంగ్రెస్ పార్టీ నేతలను ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ వెంట జనం ఉన్నారు. జగన్ ని చూసి భయపడటం అంటే జనాన్ని చూసి భయపడటమే అన్నారు. ప్రజల్లోకి వెళ్లి జగన్మోహన రెడ్డిని విమర్శిస్తే ప్రజలు చెప్పులతో కొడతారని హెచ్చరించారు.
రాష్ట్రంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా జగన్మోహన రెడ్డికి ఆపాదించడం అలవాటైపోయింది. ఆనాడు పరిటాల రవిని చంపినప్పుడు జగన్ ది బాధ్యత అన్నారు. ఇప్పుడు సూరి హత్య కేసులో నిందితులు జగన్ కు సన్నిహితులని ప్రచారం చేస్తున్నారు. జగన్ 22 వేల కిలోమీటర్లు ప్రజల మధ్య తిరుగుతూ ఉంటే ఆయనపై ఇటువంటి ఆరోపణలు చేయాలని ఎలా అనిపిస్తోందని ఆయన ప్రశ్నించారు. జగన్మోహన రెడ్డిపై దుష్ప్రచారం మానుకోమని ఆయన సలహా ఇచ్చారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనుచరులు ఎందరిపై కేసులు ఉన్నాయి. ఎందరు జైలుకు వెళ్లారు. ఈ విషయాలు ఏవీ ఈనాడుకు కనిపించవా? అని ఆయన ప్రశ్నించారు.
ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలనే అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ చెబుతోందన్నారు. అక్కడ కాంగ్రెస్ చెప్పిన విషయాలనే ఇక్కడ టిడిపి చెబుతోందన్నారు. తమకు వ్యక్తిగత దూషణలకు దిగే అలవాటు లేదన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు నెరపడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్షణం అన్నారు.
ప్రజలు కడపలో బుద్ది చెప్పారు. కొవ్వూరులో కూడా అదే జరిగింది. ఈరోజు 18 స్థానాలలో కూడా అదే పరిస్థితి ఉత్పన్నమవుతుందని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా జగన్మోహన రెడ్డికి ఆపాదించడం అలవాటైపోయింది. ఆనాడు పరిటాల రవిని చంపినప్పుడు జగన్ ది బాధ్యత అన్నారు. ఇప్పుడు సూరి హత్య కేసులో నిందితులు జగన్ కు సన్నిహితులని ప్రచారం చేస్తున్నారు. జగన్ 22 వేల కిలోమీటర్లు ప్రజల మధ్య తిరుగుతూ ఉంటే ఆయనపై ఇటువంటి ఆరోపణలు చేయాలని ఎలా అనిపిస్తోందని ఆయన ప్రశ్నించారు. జగన్మోహన రెడ్డిపై దుష్ప్రచారం మానుకోమని ఆయన సలహా ఇచ్చారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనుచరులు ఎందరిపై కేసులు ఉన్నాయి. ఎందరు జైలుకు వెళ్లారు. ఈ విషయాలు ఏవీ ఈనాడుకు కనిపించవా? అని ఆయన ప్రశ్నించారు.
ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలనే అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ చెబుతోందన్నారు. అక్కడ కాంగ్రెస్ చెప్పిన విషయాలనే ఇక్కడ టిడిపి చెబుతోందన్నారు. తమకు వ్యక్తిగత దూషణలకు దిగే అలవాటు లేదన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు నెరపడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్షణం అన్నారు.
ప్రజలు కడపలో బుద్ది చెప్పారు. కొవ్వూరులో కూడా అదే జరిగింది. ఈరోజు 18 స్థానాలలో కూడా అదే పరిస్థితి ఉత్పన్నమవుతుందని ఆయన స్పష్టం చేశారు.
0 comments:
Post a Comment