హైదరాబాద్, విజయవాడ, కశింకోట(విశాఖ జిల్లా), న్యూస్లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్యే వై.ఎస్.విజయమ్మ 57వ జన్మదిన వేడుకలు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. విశాఖ జిల్లా పాయకరావుపేట పర్యటనలో ఉన్న జగన్మోహన్రెడ్డి కశింకోటలో కేక్ను కోశారు. అక్కడి ఆర్ఈసీఎస్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ను జగన్ కట్ చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు పూజలు, ప్రార్థనలతో పాటుగా పేదలకు అన్నదానం, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారికి పండ్లు, రొట్టెలు పంచి పెట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో కేక్లు కోసి ఆనందోత్సాహాల మధ్య విజయమ్మ జన్మదినాన్ని జరుపుకొన్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలను నిర్వహించారు.
8 వేల మందికి ఉచిత వైద్యం: వైఎస్ విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా కృష్ణా జిల్లా గన్నవరంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ దుట్టా శాంతివర్ధన్ చారిటబుల్ ట్రస్ట్, వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర సేవాదళ్ ఆధ్వర్యంలో ఎనిమిదివేల మందికి ఇక్కడ వైద్య పరీక్షలు చేసి రూ.6 లక్షలకు పైగా విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.
0 comments:
Post a Comment