ఈనాడు కథనాలపై మాలతీ చందూర్‌ అభ్యంతరం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈనాడు కథనాలపై మాలతీ చందూర్‌ అభ్యంతరం

ఈనాడు కథనాలపై మాలతీ చందూర్‌ అభ్యంతరం

Written By news on Tuesday, April 10, 2012 | 4/10/2012

చెన్నై : ఈనాడు పత్రిక కథనాలపై ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్‌ మండిపడ్డారు. చెన్నైలోని పొట్టి శ్రీరాములు స్మారక మందిరంపై ఈనాడులో వచ్చిన అద్దెకు అమరజీవి భవనం కథనంపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ మందిర నిర్వాహక కమిటీ అధ్యక్షురాలుగా మాలతీ చందూర్‌ వ్యవహరిస్తున్నారు. 

పొట్టి శ్రీరాములు స్మారక మందిరం నిర్వహణ కోసం ఏటా ప్రభుత్వం రెండు లక్షల గ్రాంట్‌ ఇస్తోందని దాన్ని భవన నిర్వహణకు వినియోగిస్తున్నామని ఆమె తెలిపారు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులున్నాయని వైఎస్‌ఆర్‌ దృష్టికి తెచ్చినపుడు లక్ష రూపాయల గ్రాంట్‌ను ఆయన రెండు లక్షలకు పెంచారని మాలతీ చందూర్‌ గుర్తుచేశారు. ఏటా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి, వర్థంతి, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాల్ని ఆ స్మారక మందిరంలో నిర్వహిస్తున్నామని తెలిపారు.

అటువంటి భవనాన్ని అద్దెకు ఇవ్వనున్నట్టు ఈనాడులో తప్పుడు కథనాలు వచ్చాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాము రాసిందే జర్నలిజం అనుకుంటున్నారా అని ఆమె ఈనాడు సంపాదకుల్ని ప్రశ్నించారు. నిజాల్ని దాచి అసత్యాల్ని ప్రచారం చేస్తే సహించేవారు లేరని మాలతీచందూర్‌ హెచ్చరించారు.
Share this article :

0 comments: