వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ అవనాపు సూరిబాబు కుటుంబాన్ని పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్రెడ్డి బుధవారం రాత్రి పరామర్శించారు. అనారోగ్యంతో హైదరాబాద్లో చికిత్స పొందు తూ ఈ నెల 9న సూరిబాబు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ మోహన్రెడ్డి నరసన్నపేట బహిరంగ సభను ముగించుకుని బుధవారం రాత్రి నేరుగా విజయనగరంలోని వారి స్వగృహాని కి వెళ్లారు. అవనాపు చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన అనంతరం సూరిబాబు సతీమణి చిన్నమ్మలు, కుమారులు విక్రమ్, విజయ్లను ఓదార్చారు.
అన్నలా ఆదుకుంటా....
‘ఇంటికి పెద్ద దూరమయ్యారు... మీరన్నా.. వైఎస్ అన్నా వీరిద్దరికీ ఎంతో అభిమానం, ప్రేమ. వీరిని మీరే చూసుకోవాల’ని జగన్మోహన్రెడ్డితో సూరిబాబు సతీమణి చిన్నమ్మలు అన్నారు.
సొంత అన్నయ్యలా వీరిద్దరిని తాను చూసుకుంటానంటూ జగన్ భరోసా ఇచ్చారు. ఇప్పటికే విజయ్ను పార్టీ జిల్లా యువజన అధ్యక్షుడిగా నియమించామని, ఇంకా ఏ అ వకాశాలున్నా వీరికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఏ క్షణాన ఎటువంటి అవసరం వచ్చినా తనతో నేరుగా మాట్లాడవచ్చని భరోసా ఇచ్చారు.
విజయ్ను ఆలింగనం చేసుకున్న జగన్
అవనాపు సూరిబాబు స్వగృహంలో ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చిన అనంతరం అక్కడ ఏర్పా టు చేసిన సభా వేదిక వద్దకు జగన్ వచ్చి సూరి బాబు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
అక్కడే ఉన్న విజయ్ను ఆలింగ నం చేసుకుని ఓదార్చారు. విక్రమ్తో మాట్లాడి అధైర్యపడవద్దని అన్నారు. జగన్మోహన్రెడ్డి తో పాటు అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, జిల్లా కన్వీనరు పెనుమత్స సాంబశివరాజు, విజయనగరం, విశాఖ జిల్లాల పరిశీలకులు కుంభా రవిబాబు, వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్,, రవిరాజు, మునిసిపల్ ఎన్నికల పరిశీలకుడు కొయ్య ప్రసాదరెడ్డి ఉన్నారు.
0 comments:
Post a Comment