జగన్ రాకతో జనసంద్రమైన నరసాపురం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ రాకతో జనసంద్రమైన నరసాపురం

జగన్ రాకతో జనసంద్రమైన నరసాపురం

Written By news on Wednesday, April 4, 2012 | 4/04/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఎంపి జగన్మోహన రెడ్డి రాక సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం జనసంద్రమైంది. జగన్ ని చూసేందుకు జనం భారీగా తరలి వచ్చారు. ఎటు చూసినా జనమే జనం. అభిమానులు, కార్యకర్తలు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాజకీయాలలో మాట ఇవ్వడం, తప్పడం సాధారణం అన్నారు. అయితే మహానేత డాక్టర్ వైఎస్ మాత్రం మాట తప్పని వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారన్నారు. తానూ అలాగే మాటకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. నల్లకాలువ వద్ద ఇచ్చిన మాట వెనక్కి తీసుకోమని ఢిల్లీ నుంచి తనపై వత్తిడి వచ్చిందన్నారు. తాను సోనియా గాంధీ మాట విని, కాంగ్రెస్ ని విడవకుండా ఉంటే కేంద్రంలో మంత్రి పదవి వచ్చి ఉండేదన్నారు. తన మాట నిలబెట్టుకునేందుకే బయటకు వచ్చానని చెప్పారు. అయితే ఎమ్మెల్యేలను తన వెంట రావద్దని 
చెప్పానన్నారు. కాంగ్రెస్ పెద్దలతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ప్రభుత్వం కూలిపోదని తెలిసిన తరువాతే చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారన్నారు. 

పదవి పోతుందని తెలిసి కూడా ప్రసాద్ రాజు పేదల పక్షాన, రైతుల పక్షాన నిలిచారని కొనియాడారు. ఇప్పుడు జరిగే పోటీ వ్యక్తుల మధ్య కాదన్నారు. రైతులు, పేదలు ఒక పక్క ఉంటే మరో పక్క కుళ్లు,కుతంత్రాలతో కూడుకున్నవారు ఉన్నారన్నారని తెలిపారు. వారి మధ్య ఈ పోటీ జరుగుతుందన్నారు. 

అంతకు ముందు మాజీ మంత్రి హరిరామ జోగయ్య మాట్లాడారు.
Share this article :

0 comments: