వెంకటానగరం: పేదరికానికి కులం, మతం, ప్రాంతం, పార్టీ లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విశాఖపట్నం జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గం వెంకటానగరంలో జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుల,మత, ప్రాంతం, పార్టీలకతీతంగా పేదవారి సంక్షేమం కోసం మహానేత వైఎస్ఆర్ తపించారని జగన్ అన్నారు. రైతుల సంక్షేమం కోసం, రైతులు అనుభవిస్తున్న కష్టాల పరిష్కారం కోసం 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని ఆయన తెలిపారు. రాజీనామా చేసిన వారిని ఆదరించాలని ఆయన పిలుపునిచ్చారు. వెంకటానగరంలో ప్రజలు ఏర్పాటు చేసుకున్న దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్యరించారు.
Home »
» పేదరికానికి కులం, మతం లేదు: జగన్
పేదరికానికి కులం, మతం లేదు: జగన్
Written By news on Friday, April 20, 2012 | 4/20/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment