ఆడిటర్ విజయ సాయిరెడ్డికి నాంపల్లి సీబీఐ కోర్టు ఇచ్చిన కండిషనల్ బెయిల్ ను హైకోర్టు రద్దు చేసింది. ఈ కేసులో గత నాలుగు రోజులుగా వాదనలు విన్న హైకోర్టు ఈ మేరకు తీర్పును ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రకటించింది. బెయిల్ మంజూరు చేస్తూ... సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు తప్పబట్టింది. మరోసారి ఇరుపక్షాల వాదనలు వినాలని పేర్కొంది.
ఈ విషయంలో పూర్తి వాదనలు మరోసారి వినాలని, తదుపరి విచారణ తర్వాతే బెయిల్ పై తీర్పును ప్రకటించాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పులో ఎక్కడా కూడా లొంగిపోవాలని న్యాయస్థానం సూచించలేదు. ఈ కేసు వచ్చే సోమ, మంగళవారాల్లో నాంపల్లి కోర్టులో విచారణకు రానుంది. కాగా సాయిరెడ్డిని తదుపరి విచారణకు అనుమతించాలని కోరుతూ సీబీఐ వేసిన పిటిషన్ ను కోర్టు మే 2వ తేదీకి వాయిదా వేసింది.
ఈ విషయంలో పూర్తి వాదనలు మరోసారి వినాలని, తదుపరి విచారణ తర్వాతే బెయిల్ పై తీర్పును ప్రకటించాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పులో ఎక్కడా కూడా లొంగిపోవాలని న్యాయస్థానం సూచించలేదు. ఈ కేసు వచ్చే సోమ, మంగళవారాల్లో నాంపల్లి కోర్టులో విచారణకు రానుంది. కాగా సాయిరెడ్డిని తదుపరి విచారణకు అనుమతించాలని కోరుతూ సీబీఐ వేసిన పిటిషన్ ను కోర్టు మే 2వ తేదీకి వాయిదా వేసింది.
0 comments:
Post a Comment