విజయవాడ టీడీపీలో మార్పులు చోటు చేసుకుంటాయా? పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తున్నాయి. విజయవాడ నగర టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వంశీ.... YSR కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను కలిశారు. అశేషంగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలతో రామవరప్పాడు నుంచి విజయవాడ వస్తున్న జగన్కు ... బెంజ్ సర్కిల్ దగ్గర వల్లభనేని వంశీ ఎదురయ్యారు. జగన్ను చూడగానే... కారు దిగి వచ్చి జగన్ను పలకరించారు. వంగవీటి రాధా స్వయంగా వంశీని జగన్ దగ్గరకు తీసుకువచ్చారు. జగన్ను అప్యాయంగా ఆలింగనం చేసుకున్న వంశీ.... దాదాపు రెండు నిమిషాలు సేపు మాట్లాడారు. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ పరిణామం విజయవాడ వాసుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇద్దరి భేటీని భారీ ర్యాలీ ఉన్న ప్రతీ ఒక్కరూ ఆసక్తిగా గమనించారు. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయోనని.... అందరూ చర్చించుకున్నారు. వంశీ కూడా త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరడం ఖాయమనే ఊహాగానాలు వినిపించాయి. మరో వైపు టీడీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై గత కొంత కాలంగా వల్లభనేని వంశీ అలకతో ఉన్నారు. దేవినేని ఉమామహేశ్వరరావుతో వంశీకి సరిపడటం లేదు. నగర అధ్యక్ష పదవికీ రాజీనామా చేస్తున్నట్టు కూడా ప్రకటించారు.
Home »
» జగన్ తో వల్లభనేని వంశీ భేటీ
జగన్ తో వల్లభనేని వంశీ భేటీ
Written By news on Friday, April 27, 2012 | 4/27/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment