వైఎస్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు

వైఎస్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు

Written By news on Thursday, April 19, 2012 | 4/19/2012

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏనాడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి అన్నారు. 2001లో వైఎస్‌ఆర్ నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ప్రత్యేక రాష్ట్రం కావాలని సోనియాను కలిశారని వైఎస్‌ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే తెలంగాణ పరిస్థితులపై పార్టీపరంగా నర్సారెడ్డి కమిటీ ఏర్పాటైందని ఆయన గుర్తుచేశారు. 

వైఎస్‌ఆర్‌ను విమర్శిస్తున్న మంత్రులు ఆయన ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదంటూ దామోదర్ రెడ్డి మండిపడ్డారు. సారయ్యలాంటివారు ఇప్పుడు వైఎస్‌ఆర్‌ను విమర్శించడం పద్దతి కాదని ఆయన ఘాటుగా స్పందించారు. వైఎస్‌ను విమర్శించడం ద్వారా పార్టీకి ఏమాత్రం లాభం చేకూరదని దామోదర్ రెడ్డి హెచ్చరించారు.
Share this article :

0 comments: