పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో రెండోవిడత ప్రచారానికి వైఎస్ జగన్ రేపట్నుంచి శ్రీకారం చుట్టనున్నారు. రెండు రోజులు పాటు ఆయన ఎన్నికల ప్రచారం సాగిస్తారు. పోలవరం పర్యటన ముగించుకుని జగన్ నర్సాపురం మండలం మెస్కేపాలెం నుంచి రోడ్షో ప్రారంభిస్తారు.
గత నెల్లో మూడు రోజులు ఎన్నికల ప్రచారం సాగించిన జగన్ రెండో విడతలో పలు గ్రామాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో వైఎస్ఆర్ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. జగన్ పర్యటన ప్రారంభం కానుండటంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధి ప్రసాదరాజుకు భారీ మెజార్టీ ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గత నెల్లో మూడు రోజులు ఎన్నికల ప్రచారం సాగించిన జగన్ రెండో విడతలో పలు గ్రామాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో వైఎస్ఆర్ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. జగన్ పర్యటన ప్రారంభం కానుండటంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధి ప్రసాదరాజుకు భారీ మెజార్టీ ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
0 comments:
Post a Comment