జగన్ తోనే రంగా అభిమానులు: వంగవీటి రాధ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ తోనే రంగా అభిమానులు: వంగవీటి రాధ

జగన్ తోనే రంగా అభిమానులు: వంగవీటి రాధ

Written By news on Friday, April 27, 2012 | 4/27/2012

తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం దివంగత వంగవీటి రంగా అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డితోనే ఉంటారని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ చెప్పారు. జగన్ సమక్షంలో రాధ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ కుటుంబాన్ని జనం మరచిపోరన్నారు. వైఎస్ఆర్ ఈ రాష్ట్రంలో ఎంతోమందిని ఆదుకున్నారని గుర్తు చేశారు.

ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ పథకాలు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు వైఎస్ఆర్ గజం 100 రూపాయలకు ఇంటి స్థలం ఇచ్చారని తెలిపారు. ఇప్పడు ఆ స్థలం గజం 45 వేల రూపాయలు అయిందన్నారు. 'మీ పాలనలోనే బందరు పోర్టు నిర్మాణం జరగాలి' అని రాధ జగన్ ని కోరారు. 

ఆనాడు తన తండ్రి వంగవీటి మోహన రంగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా ఉండగా 1985లో ఎమ్మెల్యేగా గెలిచారని తెలిపారు. 2004లో తనకు ఆయన ఆధ్వర్యంలో పనిచేసే భాగ్యం లభించిందన్నారు. తమ కుటుంబాన్ని నాయకులు మోసం చేశారు గానీ, జనం ఎప్పుడూ తమని అంటిపెట్టుకొని ఉన్నారని తెలిపారు. 

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా సభకు హాజరయ్యారు.
Share this article :

0 comments: