వరంగల్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోతోనే ఉపఎన్నికలకు వెళ్లడమే కాకుండా గెలిచి చూపిస్తామని మాజీ మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. నమ్మిన నాయకుడు వైఎస్ కోసం మంత్రి పదవి నుంచి తప్పుకున్నానని, తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని ఆమె తెలిపారు. సీఎంగా ఎవరుంటే పొన్నాల వారి కాళ్లు పట్టుకుంటారని, అలాంటి పొన్నాలకు తమ గురించి మాట్లాడే నైతికత లేదని సురేఖ మండిపడ్డారు. దళితుల భూములను పొన్నాల బకాసురునిలా తిన్నారని ఆమె అరోపించారు. అంతేకాకుండా ప్రభుత్వం తమ మీద కక్ష సాధిస్తోందని, అందులో భాగంగానే గన్మెన్లను తొలగించిందని సురేఖ మీడియాతో అన్నారు. పరకాల ప్రజలే తమని కాపాడుకుంటారని అన్నారు.
Home »
» వైఎస్ ఫోటోతో పరకాలలో గెలుస్తా: కొండా సురేఖ
వైఎస్ ఫోటోతో పరకాలలో గెలుస్తా: కొండా సురేఖ
Written By news on Friday, April 13, 2012 | 4/13/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment