ప్రచారంలో కులం, మతం ప్రస్తావన తీసుకురాకూడదనే ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించిన టీడీపీ నేత చంద్రబాబు నాయుడు మీద కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయా లని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్లాల్కు, తిరుపతి రిటర్నింగ్ అధికారి ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. గురువా రం తిరుపతికి వచ్చిన చంద్రబాబు ముత్యాలరెడ్డిపల్లె సర్కిల్లో బహిరంగ సభలో మా ట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ నాస్తికుడు, ఆయ ున తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని కూ డా దర్శించుకోలేద’న్నారని, ఈ ప్రసంగం ఒక మతం వారిని రెచ్చగొట్టే విధంగా ఉందని నారాయణస్వామి పేర్కొన్నారు. కోడ్ను ఉల్లంఘించిన బాబు మీద కేసు నమోదు చేయాలని కోరారు.
అధికారుల అవగాహనా లోపంతోనే విగ్రహానికి ముసుగులు: ఎన్నికల నిబంధనల మీద అవగాహన లేక పోవడంతో అధికారులు గురువారం తిరుపతిలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు ముసుగులు వేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలింగ్కు 24 గంటల ముందు, పోలింగ్స్టేషన్లకు 100 మీటర్ల దూరంలో ఉన్న రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు వేయించాలని ఇటీవల జరిగి ఉప ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్, తిరుపతి రిటర్నింగ్ అధికారి అత్యుత్సాహం చూపుతూ వైఎస్ఆర్ విగ్రహానికి మాత్రమే ముసుగులు వేయించి మిగిలిన విగ్రహాలను వదిలేశారని ఆయన ఫిర్యాదు చేశారు.
0 comments:
Post a Comment