ఆడిటర్ విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్ పై వాదనలు సోమవారం ముగిశాయి. తీర్పును సీబీఐ కోర్టు ఈ నెల 12 తేదికి వాయిదా వేసింది. సీబీఐ పనితీరుపై సీబీఐ కోర్టు న్యాయమూర్తి ప్రశ్నల వర్షం కురిపించారు. దర్యాప్తు పూర్తి కాకుండానే జగన్ను నిందితుడిగా ఎలా చేరుస్తారని కోర్టు ప్రశ్నించింది. ఒకే నేరంపై జగన్పై ఎన్ని కేసులు పెడుతారని, ఎన్ని శిక్షలు వేస్తారని, ఎన్ని చార్జిషీట్లు దాఖలు చేస్తారని సీబీఐని కోర్టు అడిగింది. ప్రతి భూకేటాయింపునకు ప్రభుత్వ జీవో ఉంటుందని, వాటాలు కొనుగోలు చేసిన వాళ్లున్నారని, అలాంటప్పుడు విజయసాయిరెడ్డి నుంచి మీరు రాబట్టిందేమిటని కోర్టు ప్రశ్నించింది. విజయసాయిని ఇంకెంత కాలం జైల్లో ఉంచుతారని ఆయన తరఫు న్యాయవాదులు అడుగుతున్న ప్రశ్నకు మీ సమాధానం ఏంటని సీబీఐని కోర్టు అడిగింది.
Home »
» దర్యాప్తు పూర్తి కాకుండానే జగన్ను నిందితుడిగా ఎలా చేరుస్తారని
దర్యాప్తు పూర్తి కాకుండానే జగన్ను నిందితుడిగా ఎలా చేరుస్తారని
Written By news on Monday, April 9, 2012 | 4/09/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment