రాష్ట్ర మంత్రుల్ని ప్రజలు తరిమికొట్టడం శాంపిల్ మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 15న ప్రారంభమయ్యే ప్రజాపథంలో తరిమికొట్టే స్థాయి ఊపందుకుంటుందని ఆయన అన్నారు. వైఎస్ఆర్ను అవినీతిపరుడిగా చిత్రీకరించాలని చూస్తే ప్రజల స్పందన ఇలాగే ఉంటుందని అంబటి వ్యాఖ్యానించారు. రానున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని జోస్యం చెప్పారు. వైఎస్ జగన్పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రజలు చీదరించుకుంటున్నారని ఆయన అన్నారు. ఎన్టీఆర్ ను శవంగా చేసి రాజకీయాల్లో లబ్ది పొందిన చరిత్ర చంద్రబాబుదేనని అంబటి విరుచుకుపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ విషయంలో స్పష్టత తెచ్చుకోవాలని కాంగ్రెస్ నేతలకు ఆయన హితవు పలికారు. భగవంతుడు దిగివచ్చినా కాంగ్రెస్ పార్టీని కాపాడలేడని అంబటి రాంబాబు అన్నారు.
Home »
» మంత్రుల్నితరిమి కొట్టడం శాంపిల్ మాత్రమే: అంబటి
మంత్రుల్నితరిమి కొట్టడం శాంపిల్ మాత్రమే: అంబటి
Written By news on Thursday, April 12, 2012 | 4/12/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment