పెదపాడు, న్యూస్లైన్ : అభిమానముంటే గుండెలోనే గుడి కట్టొచ్చు. అదే చేశారు మహానేత వైఎస్ఆర్ అభిమాని కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన కనుమూరి సుబ్బరాజు (రాజాబాబు). రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా తన అభిమాన నేత పేరుతో హనుమాన్ జంక్షన్లోని నూజివీడు రోడ్డులో ఉచిత కల్యాణ మండపాన్ని నిర్మించారు. ఎవరైనా సరే ఈ ఫంక్షన్ హాలులో ఉచితంగా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. పైసామే పరమాత్మ అనుకుంటున్న ఈరోజుల్లో లాభాపేక్ష లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గన్నవరం నియోజకవర్గ నాయకులు డాక్టర్ దుట్టా రామచంద్రరావు నేతృత్వంలో రాజాబాబు చేపట్టిన ఈ బృహత్కార్యం పలువురి అభినందనలు అందుకొంది. ఈ మండపంలో 1000 మంది కూర్చునే సౌకర్యం, భోజనాలకు విశాలమైన హాలుతోపాటు పార్కిం గ్ స్థలం ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఘనస్వాగతానికి ఏర్పాట్లు
మండపం ప్రారంభోత్సవానికి రానున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘనస్వాగతం పలకనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ అప్పల కనకదుర్గా ప్రసాద్, నాయకులు డాక్టర్ దుట్టా రామచంద్రరావు తెలిపారు. అభయాంజనేయస్వామి ఆలయం వద్ద నుంచి గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహించనున్నామని వివరించారు.
ఘనస్వాగతానికి ఏర్పాట్లు
మండపం ప్రారంభోత్సవానికి రానున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘనస్వాగతం పలకనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ అప్పల కనకదుర్గా ప్రసాద్, నాయకులు డాక్టర్ దుట్టా రామచంద్రరావు తెలిపారు. అభయాంజనేయస్వామి ఆలయం వద్ద నుంచి గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహించనున్నామని వివరించారు.
0 comments:
Post a Comment