కృష్ణా: ముదినేపల్లి మండలం కొత్తపల్లిలో వైఎస్, అంబేద్కర్ విగ్రహాలను వైఎస్ఆర్ సీపీ నేత జూపూడి ప్రభాకర్రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు దూలం నాగేశ్వరరావు, అబ్రహం లింకన్లు పాల్గొన్నారు. మహానేత వైఎస్పై కాంగ్రెస్ దళిత నేతల వ్యాఖ్యలు కృతజ్ఞతారాహిత్యమని ఆయన అన్నారు. ఆనాడు పదవులు అనుభవించి నేడు దివంగత నేతపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. వైఎస్పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, లేకుంటే దళిత ద్రోహులుగా మిగులుతారని ఆయన తెలిపారు. త్వరలో జరుగునున్న ఉపఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీదే విజయమని జూపూడి ప్రభాకర్రావు ధీమా వ్యక్తం చేశారు.
Home »
» వైఎస్ఆర్ సీపీదే విజయం: జూపూడి
వైఎస్ఆర్ సీపీదే విజయం: జూపూడి
Written By news on Friday, April 13, 2012 | 4/13/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment