రెండు మూడు రోజుల్లో మరో ముగ్గురు కాంగ్రెస్ ఎంపిలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి సంఘీభావం తెలుపుతారని కాంగ్రెస్ ఎంపి సబ్బం హరి చెప్పారు. లోటస్ పాండ్ వద్ద ఈ సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ పరిస్థితులలో జగన్ కు సంఘీభావం తెలపడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
జగన్ అభిమానులను ఆందోళనకు గురిచేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, అది మంచి పద్దతి కాదని ఆయన చెప్పారు. రేపు కూడా జగన్ సిబిఐ విచారణకు హాజరవుతారన్నారు. సోమవారం వరకు సిబిఐ ఎటువంటి నిర్ణయం తీసుకోదని ఆయన
చెప్పారు. జగన్ కు సంబంధించి ఊహాజనిత వార్తలు ప్రచారం చేసింది గాక, ఆ ప్రచారం ప్రకారం అరెస్ట్ చేయలేదేంటి అని ప్రశ్నిస్తున్నారన్నారు. తప్పుడు ప్రచారాలు చేయవద్దని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు.
జగన్ అభిమానులను ఆందోళనకు గురిచేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, అది మంచి పద్దతి కాదని ఆయన చెప్పారు. రేపు కూడా జగన్ సిబిఐ విచారణకు హాజరవుతారన్నారు. సోమవారం వరకు సిబిఐ ఎటువంటి నిర్ణయం తీసుకోదని ఆయన
చెప్పారు. జగన్ కు సంబంధించి ఊహాజనిత వార్తలు ప్రచారం చేసింది గాక, ఆ ప్రచారం ప్రకారం అరెస్ట్ చేయలేదేంటి అని ప్రశ్నిస్తున్నారన్నారు. తప్పుడు ప్రచారాలు చేయవద్దని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు.
0 comments:
Post a Comment