జగన్ అరెస్టు గురించి సీబీఐ అధికారులు కేవలం 20 నిముషాల ముందే చెప్పారని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి చెప్పారు. తాను లీగల్ విషయాలు ప్రస్తుతం మాట్లాడే పరిస్థితిలో లేనని, ఆ విషయాలన్నీ సీబీఐ అధికారులే స్వయంగా వెల్లడిస్తారని సబ్బం చెప్పారు. వ్యక్తిగత న్యాయవాది సమక్షంలో అరెస్టు చేస్తామని సీబీఐ చెప్పిన మేరకు జగన్ న్యాయవాది దిల్ కుష్ కు వచ్చారని, అలాగే జగన్ కుటుంబీకులు కూడా ఇక్కడికి చేరుకున్నారని ఆయన చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని అభిమానులకు జగన్ పిలుపునిచ్చినట్టు సబ్బం హరి పేర్కొన్నారు. జగన్ సన్నిహితుడిగానే తాను ఆదివారం ఉదయం నుంచి ఇక్కడే ఉన్నట్టు ఆయన చెప్పారు.
Home »
» '20 నిముషాల ముందు తెలిసింది'
'20 నిముషాల ముందు తెలిసింది'
Written By news on Sunday, May 27, 2012 | 5/27/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment