ప్రభుత్వం జారీ చేసిన అటాచ్ మెంట్లను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని దక్కన్ క్రానికల్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి అన్నారు. పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడికి నిరసనగా జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ ఈనాడు బొమ్మ అయితే సాక్షి బొరుసు వంటిదన్నారు. ప్రత్యామ్నాయ గొంతును నొక్కడం తప్పు అని... సాక్షి చదవటం పాఠకుల హక్కు అన్నారు.
సాక్షిపై ప్రభుత్వం ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తోందని సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అన్నారు. సాక్షిపై ప్రభుత్వ చర్యలు అనవసరమన్నారు. రిజర్వ్ బ్యాంక్ చట్టాలను ఉల్లంఘించిన రామోజీపై ఎలాంటి చర్యలు లేవని ఆయన గుర్తు చేశారు. జనం నుంచి అక్రమంగా 40వేల కోట్లు వసూలు చేసి భయంకర ఆర్థిక సామ్రాజ్యాన్ని రామోజీ సృష్టించారన్నారు. సాక్షి మీడియాపై జరిగిన దాడి నిస్సందేహంగా పత్రికా స్వేచ్ఛపై జరిగిందేనన్నారు. సాక్షి మీడియాపై దాడి పత్రికలపై దాడి కాదనటం శోచనీయమన్నారు.
సాక్షిపై ప్రభుత్వం ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తోందని సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అన్నారు. సాక్షిపై ప్రభుత్వ చర్యలు అనవసరమన్నారు. రిజర్వ్ బ్యాంక్ చట్టాలను ఉల్లంఘించిన రామోజీపై ఎలాంటి చర్యలు లేవని ఆయన గుర్తు చేశారు. జనం నుంచి అక్రమంగా 40వేల కోట్లు వసూలు చేసి భయంకర ఆర్థిక సామ్రాజ్యాన్ని రామోజీ సృష్టించారన్నారు. సాక్షి మీడియాపై జరిగిన దాడి నిస్సందేహంగా పత్రికా స్వేచ్ఛపై జరిగిందేనన్నారు. సాక్షి మీడియాపై దాడి పత్రికలపై దాడి కాదనటం శోచనీయమన్నారు.
0 comments:
Post a Comment