ఆళ్లగడ్డ (కర్నూలు), న్యూస్లైన్: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పాటు మరో 10 మంది టీడీపీ నాయకులపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్ఐ రమేష్బాబు గురువారం తెలిపారు. కోడ్ అమలులో ఉన్నప్పటికీ ఏప్రిల్ 29న ఆళ్లగడ్డ పట్టణంలో చంద్రబాబునాయుడు పాల్గొన్న సమావేశానికి ప్రభుత్వ స్థలాన్ని వినియోగించుకున్నారని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మాదం రవి కోర్టులో ఫిర్యాదు చేశారు.
అనుమతి లేకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించి, కరెంట్, టెలిఫోన్ స్తంభాలకు పార్టీ జెండాలు, బ్యానర్లు కట్టారని ఆయనతో ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబునాయుడు, టీడీపీ నాయకులు కేఈ ప్రభాకర్, మీనాక్షినాయుడు, ఎన్ఎండీ ఫరూక్, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, బెరైడ్డి రాజశేఖరరెడ్డి, బీసీ జనార్దన్రెడ్డి, ఎన్హెచ్ భాస్కరరెడ్డి, మసాల పద్మజ, మణిగాంధీ, ఇరిగెల రాంపుల్లారెడ్డిలపై ఐపీసీ 188 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశామని ఎస్ఐ వివరించారు.
అనుమతి లేకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించి, కరెంట్, టెలిఫోన్ స్తంభాలకు పార్టీ జెండాలు, బ్యానర్లు కట్టారని ఆయనతో ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబునాయుడు, టీడీపీ నాయకులు కేఈ ప్రభాకర్, మీనాక్షినాయుడు, ఎన్ఎండీ ఫరూక్, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, బెరైడ్డి రాజశేఖరరెడ్డి, బీసీ జనార్దన్రెడ్డి, ఎన్హెచ్ భాస్కరరెడ్డి, మసాల పద్మజ, మణిగాంధీ, ఇరిగెల రాంపుల్లారెడ్డిలపై ఐపీసీ 188 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశామని ఎస్ఐ వివరించారు.
0 comments:
Post a Comment