వరంగల్ : పరకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఓ సెట్ నామినేషన్ దాఖలు చేసిన ఆమె ఈరోజు మరోసెట్ దాఖలు చేశారు. అలాగే టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు మొలుగూరి బిక్షపతి, డాక్టర్ విజయచందర్ మరో సెట్ నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్, టీడీపీ, ఎంసీపీఐ అభ్యర్ధులు సాంబారి సమ్మారావు, చల్లా ధర్మారెడ్డి, సోమిడి శ్రీనివాస్ రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేయగా, చల్లా జ్యోతి టీడీపీ డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.
కాగా ఈ నెల 26వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 27, 28 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణలకు చివరి తేది. 28వ తేదీ మధ్యాహ్నం 3గంటల తర్వాత పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు వెల్లడిస్తారు.
0 comments:
Post a Comment