'ఎన్నికుట్రలు పన్నినా జగన్ కు తిరుగులేదు' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'ఎన్నికుట్రలు పన్నినా జగన్ కు తిరుగులేదు'

'ఎన్నికుట్రలు పన్నినా జగన్ కు తిరుగులేదు'

Written By news on Saturday, May 5, 2012 | 5/05/2012

ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి తిరుగులేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్ స్సష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనాడు అధినేత రామోజీ రావు, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన హయాంలో వేలాది ఎకరాల భూములు అప్పనంగా కట్టబెట్టారన్నారు. అప్పుడు రామోజీ కళ్లు మూసుకుపోయాయా? అని ప్రశ్నించారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం దివంగత మహానేత డాక్టర్ వైఎస్ భూములిచ్చారని తెలిపారు. అది నేరమన్నట్లు 'ఈనాడు' తాటికాయంత అక్షరాలతో రాసిందన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేలాది ఎకరాల భూమిని తక్కువరేటుకే రామోజీ కాజేయలేదా? అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మార్, ఐఎంజీ , జిఎంఆర్ లకు చంద్రబాబు వేలాది ఎకరాలివ్వలేదా? అని ఆయన అడిగారు. రామోజీ రావు చంద్రబాబుతో కుమ్మకై రాష్ట్ర ప్రగతిని కుంటుపరిచారన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్ కుటుంబాన్ని, జగన్‌ను ప్రజల నుంచి వేరు చేయలేరని ఆయన అన్నారు.
Share this article :

0 comments: