పాయకరావుపేట : భారీగా తరలివచ్చిన జనం సాక్షిగా పాయకరావుపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్ల బాబూరావు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. నక్కపల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఆయన తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. బాబూరావు నామినేషన్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. దాంతో ఎన్నడూ లేనంతంగా నక్కపల్లి హైవే మొత్తం స్తంభించిపోయింది.
అంతకు ముందు బాబురావు నక్కపల్లి బస్టాండ్ వద్ద మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఈ ర్యాలీకి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.
అంతకు ముందు బాబురావు నక్కపల్లి బస్టాండ్ వద్ద మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఈ ర్యాలీకి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.
0 comments:
Post a Comment