వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎంవీ మైసూరారెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆయన ఈరోజు ఉదయం జగన్ తో భేటీ అయ్యారు. అనంతరం మైసూరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకు ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరిస్తానని, పార్టీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. జగన్ కు ప్రజాదరణ ఉందని, ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మైసూరారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే కాంగ్రెస్ కుట్రలకు పాల్పడుతుందని మైసూరారెడ్డి అన్నారు. సీబీఐ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఇదంతా ఢిల్లీ పెద్దల కుట్ర అని మైసూరారెడ్డి అన్నారు. తాను ఎన్నడూ చంద్రబాబునాయుడును రాజ్యసభ సీటు అడగలేదని ఆయన తెలిపారు.
జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే కాంగ్రెస్ కుట్రలకు పాల్పడుతుందని మైసూరారెడ్డి అన్నారు. సీబీఐ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఇదంతా ఢిల్లీ పెద్దల కుట్ర అని మైసూరారెడ్డి అన్నారు. తాను ఎన్నడూ చంద్రబాబునాయుడును రాజ్యసభ సీటు అడగలేదని ఆయన తెలిపారు.
0 comments:
Post a Comment