సాక్షి ఖాతాల స్తంభన, ఇతర చర్యలు భావ ప్రకటన, వ్యక్తీకరణపై జరిగిన తీవ్రమైన దాడి. ఈ దాడిని సమైక్యంగా తిప్పికొట్టాలి. వ్యక్తిగత కక్షలు తీర్చుకోడానికి సీబీఐని పత్రికపైకి ప్రయోగిస్తున్నారు. వాస్తవానికి సీబీఐ ఇలాంటి చర్యలకు దిగరాదు. ఎందుకంటే..పత్రిక అనేది సాధారణ ప్రజానీకం అభిప్రాయాలను ప్రతిఫలిస్తుంది. ఎవరైనా తప్పుచేసి ఉంటే వారిపై చర్యలకు వెళ్లాలే తప్పించి పత్రికపై చర్యలకు పాల్పడటం సరికాదు. అవినీతి జరిగి ఉంటే ఇన్నాళ్లు ఎందుకు కిమ్మనలేదు? వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ను వీడినప్పటి నుంచే ఇవన్నీ ప్రారంభం కావడాన్ని బట్టి అసలు అంతర్యం అర్ధమవుతోంది. సీబీఐ దురుద్దేశాలేమిటో కళ్లకు కడుతున్నాయి. వ్యక్తిగత కక్షను తీర్చుకోడానికి సీబీఐని ఉపయోగిస్తూ మీడియాపై సాగిస్తున్న ఈ దాడిని మేం ఖండిస్తున్నాం. దీన్నందరూ ముక్తకంఠంతో ఖండించాలి. లేకపోతే ఈ రోజు జగన్మోహన్రెడ్డి విషయంలో జరుగుతున్నది రేపు మరొకరికి ..ఎల్లుండి ఇంకొకరికి జరిగే ప్రమాదం ఉంది. అది పత్రికా స్వేచ్ఛకు అతిపెద్ద సవాల్గా పరిణమించే ఆస్కారం ఉంది. - పరమానంద పాండే ప్రధాన కార్యదర్శి, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ |
Home »
» రేపు మరొకరిపై జరుగుతుంది
రేపు మరొకరిపై జరుగుతుంది
Written By news on Saturday, May 19, 2012 | 5/19/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment