పసుపు రైతులకు జగన్ పరామర్శ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పసుపు రైతులకు జగన్ పరామర్శ

పసుపు రైతులకు జగన్ పరామర్శ

Written By ysrcongress on Thursday, May 3, 2012 | 5/03/2012


వైఎస్ఆర్ జిల్లాలోని బకరాపేట వద్ద పసుపురైతులను వైఎస్ జగన్మోహనరెడ్డి పరామర్శించారు. ఉప ఎన్నికల ప్రచారంలో బకరాపేట చేరుకున్న జగన్ కు గిట్టుబాటు ధర రావడం లేదంటూ రైతులు మొరపెట్టుకున్నారు. పంట ఖర్చు వివరాలను రైతులను జగన్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వంపై పోరాడి మద్ధతు ధర కోసం కృషి చేస్తానని రైతులకు జగన్ భరోసానిచ్చారు.

మహానేత వైఎస్‌ హయాంలో క్వింటాల్ పసుపు ధర రూ.16వేలు పలికిందని.. ఇప్పుడు కనీసం రూ.2,500 కూడా రావడం లేదని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పసుపు రైతులను ఆదుకునే నాధుడే లేడని జగన్ అన్నారు. చేనేత కార్మికుల కోసం నిరాహారదీక్ష చేసినా ఈ ప్రభుత్వం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే సువర్ణయుగానికి ఈ ఉపఎన్నికలే నాంది అని అన్నారు. ప్రతి రైతన్నా ఇది నా ప్రభుత్వం అనుకునేలా చేస్తా అని జగన్ అన్నారు.


Share this article :

0 comments: