పరకాలలో జరిగే ఉప ఎన్నికతో తెలంగాణ ఎట్ల వస్తుందో? ఎప్పుడు వస్తుందో? కచ్చితంగా ప్రకటిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని వైఎస్ఆర్ సీపీ పరకాల అభ్యర్థి కొండా సురేఖ స్పష్టం చేశారు. కొండా దంపతులు సెంటిమెంట్గా భావించే పరకాల మండలంలోని కామారెడ్డిపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సురేఖ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రతి ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. అధికారమే తప్ప, తెలంగాణ రాష్ట్రం సాధించాలనే యావ ఆ పార్టీకి ఏమాత్రం లేదని విమర్శించారు. అమరుల కుటుంబాల సభ్యులను ఉమ్మడి అభ్యర్థులుగా ప్రకటించాలని కేసీఆర్, హరీష్రావు, రాజేందర్కు సవాల్ విసిరారు. 20 ఏళ్ల నుంచి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నామని, ప్రజల ఆదరాభిమానాలు, ఆశీస్సులే తమను ఈ స్థాయికి చేర్చాయన్నారు. ఈ ఎన్నికలో కూడా ప్రజలు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Home »
» పరకాల సీటుతో తెలంగాణ వస్తుందంటే పోటీ నుంచి తప్పుకుంటా
పరకాల సీటుతో తెలంగాణ వస్తుందంటే పోటీ నుంచి తప్పుకుంటా
Written By news on Wednesday, May 9, 2012 | 5/09/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment