గుంటూరు : ఉప ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం మొదలైంది. శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావటం అంతలోనే నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అందరికంటే ముందుగా గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో నామినేషన్ వేశారు.
ఈ నెల ఇరవై ఐదు వరకూ రోజూ ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇప్పటికే అమలవుతున్న ఎన్నికల కోడ్ ఇక నుంచి మరింత కఠినంగా ఉంటుందని, అన్నిరాజకీయ పక్షాలు సహకరించాలని అఖిల పక్ష సమావేశంలో సీఈవో భన్వర్లాల్ స్పష్టం చేశారు.
నియమావళిని తప్పకుండా పాటించాలని, ఇక అభ్యర్థుల ఖర్చు విషయంలో కూడా పర్యవేక్షకుల నిఘా ఉంటుందని తెలిపారు. ఉప ఎన్నికల నియమావళి, ప్రచారం కోసం అభ్యర్థులు పెట్టే ఖర్చు విషయంలో అత్యంత కఠినంగా ఉంటామని ఎన్నికల సంఘం తెలిపింది.
ఈ నెల ఇరవై ఐదు వరకూ రోజూ ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇప్పటికే అమలవుతున్న ఎన్నికల కోడ్ ఇక నుంచి మరింత కఠినంగా ఉంటుందని, అన్నిరాజకీయ పక్షాలు సహకరించాలని అఖిల పక్ష సమావేశంలో సీఈవో భన్వర్లాల్ స్పష్టం చేశారు.
నియమావళిని తప్పకుండా పాటించాలని, ఇక అభ్యర్థుల ఖర్చు విషయంలో కూడా పర్యవేక్షకుల నిఘా ఉంటుందని తెలిపారు. ఉప ఎన్నికల నియమావళి, ప్రచారం కోసం అభ్యర్థులు పెట్టే ఖర్చు విషయంలో అత్యంత కఠినంగా ఉంటామని ఎన్నికల సంఘం తెలిపింది.
0 comments:
Post a Comment