ఒత్తిడికి లోనైన చంద్రబాబు రాజకీయ ఉన్మాదిలా తిరుగుతున్నాడని గట్టు రామచంద్రరావు అన్నారు. చంద్రబాబుది రాక్షస పుట్టుక అని ఆయన వ్యాఖ్యానించారు. మహానేత వైఎస్ని బీసీ వ్యతిరేకి అని నీచంగా మాట్లాడటం తగదని గట్టు హితవు పలికారు. రాష్ట్రంలోని బీసీలంతా తమ రాజకీయ వారసుడిగా జగన్నే చూసుకుంటున్నారని, బీసీలను ఓట్లడిగే హక్కు జగన్కే ఉందని గట్టు తెలిపారు. బీసీల్లో ఎన్ని ఉపకులాలు ఉన్నాయో ఇప్పటికైనా తెలుసా అని ఆయన ప్రశ్నించారు. తొమ్మిదేళ్ల తెలుగుదేశం పార్టీ పాలనలో బీసీలకు ఏం చేశావో చెప్పాలని గట్టు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కులవృత్తులను సర్వనాశనం చేసింది చంద్రబాబేనని గట్టు ఆరోపించారు. చంద్రబాబు తిరుపతి వెళ్తే... వెంకన్న కూడా భయపడే పరిస్థితి ఉందని ఆయన అన్నారు. దేవుళ్లను కూడా రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటున్నాడని గట్టు విమర్శించారు. జగన్ తిరుమల పర్యటనపై మీడియా అనవసర రాద్ధాంతం చేయడం తగదని ఆయన విజ్క్షప్తి చేశారు.
రాష్ట్రంలో కులవృత్తులను సర్వనాశనం చేసింది చంద్రబాబేనని గట్టు ఆరోపించారు. చంద్రబాబు తిరుపతి వెళ్తే... వెంకన్న కూడా భయపడే పరిస్థితి ఉందని ఆయన అన్నారు. దేవుళ్లను కూడా రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటున్నాడని గట్టు విమర్శించారు. జగన్ తిరుమల పర్యటనపై మీడియా అనవసర రాద్ధాంతం చేయడం తగదని ఆయన విజ్క్షప్తి చేశారు.
0 comments:
Post a Comment