వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమ అరెస్టుపై నిరసనలు ఖండాంతరాలు దాటాయి. జగన్ అరెస్టును నిరసిస్తూ లాస్ఏంజెల్స్లో మహానేత వైఎస్ అభిమానులు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దిష్టిబొమ్మను ఊరేగించారు. యూఎస్ఎ వైఎస్ ఫాన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రోడ్లపై సోనియా దిష్టిబొమ్మలను పడేసి కర్రలతో చితక్కొట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫాన్స్ క్లబ్ అధ్యక్షుడు నంద్యాల వీరారెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మహానేత వైఎస్ హెలికాప్టర్ ప్రమాద ఘటనపై అనుమానాలు నిజమనిపిస్తున్నాయన్నారు.
గల్ఫ్ దేశమైన అబుదాబిలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు కార్మికులు ‘సొల్యూషన్స్ తెలుగు యూత్’ ఆధ్వర్యంలో సోమవారం సమావేశమై జగన్కు మద్దతు ప్రకటించారు. ఆ సంస్థ సభ్యుడు తాడి విజయమోహన్ ‘న్యూస్లైన్’కు ఈ మెయిల్ ద్వారా వివరాలు పంపారు. జగన్ను అరెస్టు చేసి జైలుకు పంపడం అన్యాయం అని గల్ఫ్ దేశం ఖతార్లో ఉపాధి పొందుతున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఖతార్ రాజధాని దోహాలో సోమవారం సమావేశమైన వారు తమ నిరసనను ఈ మెయిల్ ద్వారా ‘న్యూస్లైన్’కు తెలిపారు.
గల్ఫ్ దేశమైన అబుదాబిలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు కార్మికులు ‘సొల్యూషన్స్ తెలుగు యూత్’ ఆధ్వర్యంలో సోమవారం సమావేశమై జగన్కు మద్దతు ప్రకటించారు. ఆ సంస్థ సభ్యుడు తాడి విజయమోహన్ ‘న్యూస్లైన్’కు ఈ మెయిల్ ద్వారా వివరాలు పంపారు. జగన్ను అరెస్టు చేసి జైలుకు పంపడం అన్యాయం అని గల్ఫ్ దేశం ఖతార్లో ఉపాధి పొందుతున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఖతార్ రాజధాని దోహాలో సోమవారం సమావేశమైన వారు తమ నిరసనను ఈ మెయిల్ ద్వారా ‘న్యూస్లైన్’కు తెలిపారు.
0 comments:
Post a Comment