వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సారా, బ్రాందీ లేని గ్రామాలుగా రూపొందిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా : చెన్నారెడ్డి కాలనీలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న జగన్ మాట్లాడుతూ.. ఇది మనస్పూర్తిగా ఇస్తున్న హామీ అని తెలిపారు. తిరుపతిలోని చెన్నారెడ్డి కాలనీలో పేదల అభ్యున్నతి కోసం పలు హామీలను జగన్ ప్రకటించారు.
తమ పార్టీ అధికారంలోకి రాగానే 700 రూపాయల వృద్ధాప్య ఫించన్లు ఇస్తామని, మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తామని, పేద విద్యార్థులకు ఇంజనీరింగ్ పూర్తయ్యేవరకు పూర్తి బాధ్యత మాదేనని జగన్ అన్నారు. త్వరలోనే మహానేత పాలన నాటి సువర్ణయుగం వస్తుందని.. పేద ప్రజలకు తోడుగా తాను ఉంటానని జగన్ భరోసానిచ్చారు.
0 comments:
Post a Comment