వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పోలీసులు చేస్తున్న దౌర్జన్యాలపై కోర్టులను ఆశ్రయిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రణాళికలను, ఆలోచనలను పోలీసులు అమలు చేస్తున్నారని బాజిరెడ్డి ఆరోపించారు. ప్రజల మద్దతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కాంగ్రెస్ పన్నాగం పన్నుతున్నారన్నారు. జగన్ను అరెస్టు చేసి, అల్లర్లు సృష్టించేందుకు కాంగ్రెస్ పక్కాగా ఎత్తుగడ పన్నుతోందన్నారు. అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, శ్రేణులనే బాధ్యులను చేసే కుట్ర చేస్తున్నారన్నారు. అరెస్టు, బైండోవర్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ఉపఎన్నికల ప్రచారానికి దూరం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. |
Home »
» దౌర్జన్యాలపై కోర్టును ఆశ్రయిస్తాం: బాజిరెడ్డి
దౌర్జన్యాలపై కోర్టును ఆశ్రయిస్తాం: బాజిరెడ్డి
Written By news on Sunday, May 27, 2012 | 5/27/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment