వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని కలవడానికి బొబ్బిలి కాంగ్రెస్ ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు రాత్రి 7 గంటల ప్రాంతంలో లోటస్ పాండ్ కు వచ్చారు. ఆయన వెంట సోదరుడు , కొంతమంది జడ్ పిటిసిలు, ఎంపిటిసిలు కూడా ఉన్నారు. రంగారావు ఈ ఉదయమే ఇక్కడకు వచ్చారు. అయితే అప్పటికే జగన్ సిబిఐ కార్యాలయానికి వెళ్లారు. దాంతో ఆయన పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను కలిసి వెళ్లారు. జగన్ పై కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ చేస్తున్న కుట్రను చూసి ఆవేదనతో వైఎస్ కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు.
లోపలికి వెళుతున్న రంగారావుని విలేకరులు ప్రశ్నించగా, బయటకు వచ్చిన తరువాత అన్ని విషయాలు చెబుతానన్నారు.
లోపలికి వెళుతున్న రంగారావుని విలేకరులు ప్రశ్నించగా, బయటకు వచ్చిన తరువాత అన్ని విషయాలు చెబుతానన్నారు.
0 comments:
Post a Comment