ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నందున సీబీఐ విచారణకు
హాజరుకాలేనంటూ ముందస్తు బెయిల్కు జగన్ దరఖాస్తు
జూన్ 15 తర్వాత ఎప్పుడైనా విచారణకు సిద్ధమని వెల్లడి
దర్యాప్తు పూర్తయింది కాబట్టి అరెస్టు చేయకపోవచ్చు: జడ్జి
అరెస్టుపై మీవి భయాలే? వాటికి సరైన కారణాలు లేవు!
తాత్కాలిక ముందస్తు బెయిలుకు కోర్టు నో
ముందస్తు బెయిలుపై విచారణ 28కి వాయిదా
అరెస్టుకు జగన్ భయపడటం లేదు: లాయర్ సుశీల్కుమార్
9 నెలలు పిలవకుండా ఎన్నికల ముందు సీబీఐకి ఇంత అర్జెంటేంటి?
దాని తీరు చూశాకే ముందస్తు బెయిల్ పిటిషన్ వేయాల్సి వచ్చింది
హైదరాబాద్, న్యూస్లైన్: వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ ఆయనపై దాఖలు చేసిన కేసులో దర్యాప్తు పూర్తయిపోయిందని, చార్జిషీటు కూడా దాఖలు చేశారని, దాన్ని తాము పరిగణనలోకి తీసుకోవటం కూడా జరిగిందని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసింది. ‘‘దర్యాప్తు పూర్తయిపోయాక కూడా ఇంకా తదుపరి దర్యాప్తు చేయటమనే ప్రసక్తి ఉండదు. దర్యాప్తు ముగిసింది కనుక సీబీఐ ఆయన్ను అరెస్టు చేయకపోవచ్చు. ఒకవేళ సీబీఐ కోరినట్టుగా వారి ఎదుట హాజరు కాకపోవటం, వారికి సహకరించకపోవటం వంటి ఇతరత్రా కారణాలుంటే తప్ప’’ అని సీబీఐ కోర్టుల ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఎ.పుల్లయ్య అభిప్రాయపడ్డారు. తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ గురువారం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసి... ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించారు. మరోవైపు ఈ నెల 25న (శుక్రవారంనాడు) తన ఎదుట హాజరు కావాల్సిందిగా సీబీఐ జగన్కు నోటీసులు జారీ చేసిందని, ఈ సందర్భంగా ఆయన్ను అరెస్టు చేసే అవకాశముంది కనుక తాత్కాలిక ముందస్తు బెయిలు మంజూరు చేయాలని జగన్ తరఫున న్యాయవాది జి.అశోక్రెడ్డి వేసిన పిటిషన్ను న్యాయమూర్తి పరిశీలించారు. ఈ దశలో సీబీఐ తరఫున సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కర్రి నరసింహవర్మ జోక్యం చేసుకొని... ‘‘వీటిపై విచారించేటపుడు జగన్ వ్యక్తిగతంగా కోర్టుకు వచ్చేలా ఆదేశించండి. దీంతోపాటు తాత్కాలిక బెయిలు పిటిషన్పై నిర్ణయం వెలువరించే ముందు మా వాదన కూడా వినండి’’ అన్నారు. దీనికి న్యాయమూర్తి నిరాకరిస్తూ... తాత్కాలిక ముందస్తు బెయిలుపై ప్రాసిక్యూషన్ వాదన వినకుండానే కోర్టు నిర్ణయం తీసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించారు. సీబీఐ వాదనలు వినాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై వాదనలు విన్న అనంతరం... జగన్ను అరెస్టు చేసే అవకాశం ఉందనటానికి సరైన కారణాలేవీ లేవని, అది కేవలం భయమే కాబట్టి ముందస్తు బెయిల్ను తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నందున ఈ నెల 25న సీబీఐ విచారణకు హాజరుకాలేన ని, తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 15వ తేదీ తర్వాత ఎప్పుడైనా సీబీఐ ముందు హాజరయ్యేందుకు సిద్ధమని తెలిపారు. పిటిషన్ను విచారించిన సందర్భంగా న్యాయమూర్తి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
న్యాయమూర్తి చేసిన కీలక వ్యాఖ్యలు...
జగన్మోహన్రెడ్డిపై దాఖలు చేసిన కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తయింది. చార్జిషీటు కూడా వేసింది. దాన్ని మేం పరిగణనలోకి తీసుకుని మా ముందు హాజరు కావాలని నోటీసులు కూడా ఇచ్చాక ఈ లోగా ఆయన్ను అరెస్టు చేయకపోవచ్చు.
దర్యాప్తు పూర్తయిపోయిన కేసులో తదుపరి దర్యాప్తులుండవు. కాబట్టి అరెస్టు చేయకపోవచ్చు.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 41(ఎ) ప్రకారం సీబీఐ జగన్కు నోటీసులిచ్చి తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. తమ వద్దనున్న సమాచారాన్ని ధ్రువపరచుకోవటానికే ఆయన్ను హాజరు కావాలని కోరుతున్నట్లు అందులో పేర్కొంది. నిజంగా అరెస్టు చేయాలని భావిస్తే దర్యాప్తు అధికారి ఏ నోటీసూ ఇవ్వకుండానే అరెస్టు చేయొచ్చు. నోటీసు ఇచ్చారంటే దానర్థం ఈ కేసుకు సంబంధించిన కొన్ని అంశాల్ని ధ్రువపరచుకోవటానికే.
సీబీఐ ఆగస్టు 17న ఎఫ్ఐఆర్ నమోదు చేశాక మార్చి 31న దర్యాప్తును ముగించి చార్జిషీటు దాఖలు చేసింది. ఒకవేళ జగన్ను అరెస్టు చేయాలనుకుంటే అప్పట్లో చార్జిషీటు దాఖలు చేయకముందు బోల్డంత అవకాశముంది. పెపైచ్చు ఈ కేసులో జగన్ తొలి ముద్దాయి కూడా. అయినాసరే దర్యాప్తునకు కీలకమైన ఆ ఏడు నెలల్లో ఆయన్ను అరెస్టు చేయలేదు. దర్యాప్తు ముగిశాక ఇప్పుడు అరెస్టు చేస్తారనుకోవటం లేదు.
తనను అరెస్టు చేస్తారనేది పిటిషనర్ భయమే తప్ప దానికి సహేతుకమైన కారణాలు లేవు. సహేతుకమైన కారణాలు లేవు కనక దీన్ని తిరస్కరిస్తున్నాం.
9 నెలల్లో ఒక్కసారీ పిలవలేదు...
అంతకుముందు వై.ఎస్.జగన్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్కుమార్ వాదిస్తూ... ఈ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది ఆగస్టు 17న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని, ఎఫ్ఐఆర్ నమోదు చేసి 9 నెలలు గడిచినా ఒక్కరోజూ జగన్ను విచారణకు పిలవలేదని, కనీసం విచారించకుండానే మూడు చార్జిషీట్లు దాఖలు చేశారని చెప్పారు. కేసులో దర్యాప్తు పూర్తిచేసిన సీబీఐ... మార్చి 31న చార్జిషీట్ను కోర్టుకు సమర్పించిందని, సీబీఐ మొదట సమర్పించిన చార్జిషీట్ను కోర్టు ఏప్రిల్ 27న విచారణకు స్వీకరించి సీసీ నం.8ని కేటాయించిందని తెలిపారు. 28న జగన్తో సహా నిందితులుగా ఉన్న 12 మందిని హాజరుకావాలని కోర్టు సమన్లు జారీచేసిందని చెప్పారు. ఈ క్రమంలోనే ఆగమేఘాల మీద సీబీఐ ఈనెల 22న జగన్కు నోటీసులు జారీచేసిందని, 25న ఉదయం 10.30కి తన ఎదుట హాజరు కావాలని ఆదేశించిందని తెలిపారు. ‘‘జగన్కు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. అందుకని ఆ 18 స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అక్కడ తమ అభ్యర్థుల్ని గెలిపించుకోవటానికి ఆయన ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. అందుకని ఈ సమయంలో రాలేనని, జూన్ 15 తర్వాత ఎప్పుడైనా విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని జగన్ కోరినా సీబీఐ అధికారులు నిరాకరించారు’’ అని సుశీల్ వివరించారు.
సుశీల్కుమార్ వాదనల్లోని ముఖ్యాంశాలివీ....
* సీఆర్పీసీ 41 కింద సీబీఐకి ఉన్న అధికారాల్ని వారు దుర్వినియోగం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో జగన్ పాల్గొనకుండా ఉండేందుకే సీబీఐ నోటీసులిచ్చింది. జగన్ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవడమే సీబీఐ లక్ష్యం.
* అరెస్టుకేమీ జగన్ భయపడటం లేదు. కానీ జూన్ 12న ఎన్నికలు. ప్రచారం కీలక దశలో ఉంది. ఇంతలోనే ఏమైంది? 9 నెలలు మౌనంగా ఉన్న సీబీఐకి ఇంత అర్జెంటుగా విచారించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన్ను అరెస్టు చేసి రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే తన ఎదుట హాజరు కావాలని అడిగినట్లుగా భావించాల్సి వస్తోంది. అందుకే ముందస్తు బెయిలు అడుగుతున్నాం.
* జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. పార్లమెంట్ సభ్యుడు. గౌరవప్రదమైన హోదాలో ఉన్నారు. నిత్యం ప్రజల్లో ఉన్నారు. ఎక్కడికీ పారిపోయే అవకాశం లేదు. జగన్కు నోటీసులు జారీచేయడం వెనుక ఏదో శక్తి పనిచేస్తోంది.
* దర్యాప్తు ముగించిన సీబీఐ.. కోర్టుకు చార్జిషీట్ సమర్పించింది. ఈ చార్జిషీట్ను కోర్టు విచారణకు స్వీకరించి జగన్ సహా 12 మంది నిందితులకు సమన్లు జారీచేసింది. నాన్ బెయిలబుల్ కేసుల్లో అవసరమని భావిస్తే కోర్టు వారంట్లు జారీచేయవచ్చు. కానీ ఈ కేసులో న్యాయమూర్తి తన విచక్షణాధికారం మేరకు వారంట్లు ఇవ్వకుండా సమన్లు మాత్రమే ఇచ్చారు.
* 9 నెలల కాలంలో దర్యాప్తును అడ్డుకున్నారనే చిన్న ఫిర్యాదు కూడా జగన్ మీద లేదు. ఆయన వ్యక్తిత్వాన్ని పరిశీలించండి. సాక్షులను బెదిరించారని గానీ, ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నించారని గానీ సీబీఐ ఈ 9 నెలల్లో ఆరోపించనే లేదు. జగన్ తన వ్యక్తిగత స్వేచ్ఛను దుర్వినియోగం చేయలేదు.
* ఈ కేసులో రెండో నిందితునిగా ఉన్న విజయసాయిరెడ్డిని సీబీఐ 30 సార్లు 300 గంటలపాటు విచారించి జనవరి 2న అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది.
న్యాయవాదుల మధ్య వాగ్వివాదం
ఈ నేపథ్యంలో సీబీఐ వాదనలు ప్రారంభించేందుకు ప్రయత్నించింది. తాత్కాలిక ముందస్తు బెయిల్ పిటిషన్పై సీబీఐ వాదనలు వినాల్సిన అవసరం లేదని సుశీల్కుమార్ స్పష్టం చేశారు. ‘ఇది పెద్ద ఫ్రాడ్’ అని సీబీఐ పీపీలు అనగా... సీబీఐనే పెద్ద దగా సంస్థ అంటూ సుశీల్ వ్యాఖ్యానించారు. అసలు శుక్రవారానికి, సోమవారానికి మధ్య ఉన్న తేడా ఏంటి ? అరెస్టు చేయబోమని సీబీఐ స్పష్టం చేస్తే విచారణకు హాజరయ్యేందుకు మాకు అభ్యంతరం లేదని చెప్పారు. ఈ సమయంలో సీబీఐ పీపీలకు, జగన్ తరఫు న్యాయవాదులకు మధ్య స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది.
హాజరుకాలేనంటూ ముందస్తు బెయిల్కు జగన్ దరఖాస్తు
జూన్ 15 తర్వాత ఎప్పుడైనా విచారణకు సిద్ధమని వెల్లడి
దర్యాప్తు పూర్తయింది కాబట్టి అరెస్టు చేయకపోవచ్చు: జడ్జి
అరెస్టుపై మీవి భయాలే? వాటికి సరైన కారణాలు లేవు!
తాత్కాలిక ముందస్తు బెయిలుకు కోర్టు నో
ముందస్తు బెయిలుపై విచారణ 28కి వాయిదా
అరెస్టుకు జగన్ భయపడటం లేదు: లాయర్ సుశీల్కుమార్
9 నెలలు పిలవకుండా ఎన్నికల ముందు సీబీఐకి ఇంత అర్జెంటేంటి?
దాని తీరు చూశాకే ముందస్తు బెయిల్ పిటిషన్ వేయాల్సి వచ్చింది
హైదరాబాద్, న్యూస్లైన్: వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ ఆయనపై దాఖలు చేసిన కేసులో దర్యాప్తు పూర్తయిపోయిందని, చార్జిషీటు కూడా దాఖలు చేశారని, దాన్ని తాము పరిగణనలోకి తీసుకోవటం కూడా జరిగిందని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసింది. ‘‘దర్యాప్తు పూర్తయిపోయాక కూడా ఇంకా తదుపరి దర్యాప్తు చేయటమనే ప్రసక్తి ఉండదు. దర్యాప్తు ముగిసింది కనుక సీబీఐ ఆయన్ను అరెస్టు చేయకపోవచ్చు. ఒకవేళ సీబీఐ కోరినట్టుగా వారి ఎదుట హాజరు కాకపోవటం, వారికి సహకరించకపోవటం వంటి ఇతరత్రా కారణాలుంటే తప్ప’’ అని సీబీఐ కోర్టుల ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఎ.పుల్లయ్య అభిప్రాయపడ్డారు. తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ గురువారం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసి... ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించారు. మరోవైపు ఈ నెల 25న (శుక్రవారంనాడు) తన ఎదుట హాజరు కావాల్సిందిగా సీబీఐ జగన్కు నోటీసులు జారీ చేసిందని, ఈ సందర్భంగా ఆయన్ను అరెస్టు చేసే అవకాశముంది కనుక తాత్కాలిక ముందస్తు బెయిలు మంజూరు చేయాలని జగన్ తరఫున న్యాయవాది జి.అశోక్రెడ్డి వేసిన పిటిషన్ను న్యాయమూర్తి పరిశీలించారు. ఈ దశలో సీబీఐ తరఫున సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కర్రి నరసింహవర్మ జోక్యం చేసుకొని... ‘‘వీటిపై విచారించేటపుడు జగన్ వ్యక్తిగతంగా కోర్టుకు వచ్చేలా ఆదేశించండి. దీంతోపాటు తాత్కాలిక బెయిలు పిటిషన్పై నిర్ణయం వెలువరించే ముందు మా వాదన కూడా వినండి’’ అన్నారు. దీనికి న్యాయమూర్తి నిరాకరిస్తూ... తాత్కాలిక ముందస్తు బెయిలుపై ప్రాసిక్యూషన్ వాదన వినకుండానే కోర్టు నిర్ణయం తీసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించారు. సీబీఐ వాదనలు వినాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై వాదనలు విన్న అనంతరం... జగన్ను అరెస్టు చేసే అవకాశం ఉందనటానికి సరైన కారణాలేవీ లేవని, అది కేవలం భయమే కాబట్టి ముందస్తు బెయిల్ను తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నందున ఈ నెల 25న సీబీఐ విచారణకు హాజరుకాలేన ని, తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 15వ తేదీ తర్వాత ఎప్పుడైనా సీబీఐ ముందు హాజరయ్యేందుకు సిద్ధమని తెలిపారు. పిటిషన్ను విచారించిన సందర్భంగా న్యాయమూర్తి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
న్యాయమూర్తి చేసిన కీలక వ్యాఖ్యలు...
జగన్మోహన్రెడ్డిపై దాఖలు చేసిన కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తయింది. చార్జిషీటు కూడా వేసింది. దాన్ని మేం పరిగణనలోకి తీసుకుని మా ముందు హాజరు కావాలని నోటీసులు కూడా ఇచ్చాక ఈ లోగా ఆయన్ను అరెస్టు చేయకపోవచ్చు.
దర్యాప్తు పూర్తయిపోయిన కేసులో తదుపరి దర్యాప్తులుండవు. కాబట్టి అరెస్టు చేయకపోవచ్చు.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 41(ఎ) ప్రకారం సీబీఐ జగన్కు నోటీసులిచ్చి తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. తమ వద్దనున్న సమాచారాన్ని ధ్రువపరచుకోవటానికే ఆయన్ను హాజరు కావాలని కోరుతున్నట్లు అందులో పేర్కొంది. నిజంగా అరెస్టు చేయాలని భావిస్తే దర్యాప్తు అధికారి ఏ నోటీసూ ఇవ్వకుండానే అరెస్టు చేయొచ్చు. నోటీసు ఇచ్చారంటే దానర్థం ఈ కేసుకు సంబంధించిన కొన్ని అంశాల్ని ధ్రువపరచుకోవటానికే.
సీబీఐ ఆగస్టు 17న ఎఫ్ఐఆర్ నమోదు చేశాక మార్చి 31న దర్యాప్తును ముగించి చార్జిషీటు దాఖలు చేసింది. ఒకవేళ జగన్ను అరెస్టు చేయాలనుకుంటే అప్పట్లో చార్జిషీటు దాఖలు చేయకముందు బోల్డంత అవకాశముంది. పెపైచ్చు ఈ కేసులో జగన్ తొలి ముద్దాయి కూడా. అయినాసరే దర్యాప్తునకు కీలకమైన ఆ ఏడు నెలల్లో ఆయన్ను అరెస్టు చేయలేదు. దర్యాప్తు ముగిశాక ఇప్పుడు అరెస్టు చేస్తారనుకోవటం లేదు.
తనను అరెస్టు చేస్తారనేది పిటిషనర్ భయమే తప్ప దానికి సహేతుకమైన కారణాలు లేవు. సహేతుకమైన కారణాలు లేవు కనక దీన్ని తిరస్కరిస్తున్నాం.
9 నెలల్లో ఒక్కసారీ పిలవలేదు...
అంతకుముందు వై.ఎస్.జగన్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్కుమార్ వాదిస్తూ... ఈ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది ఆగస్టు 17న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని, ఎఫ్ఐఆర్ నమోదు చేసి 9 నెలలు గడిచినా ఒక్కరోజూ జగన్ను విచారణకు పిలవలేదని, కనీసం విచారించకుండానే మూడు చార్జిషీట్లు దాఖలు చేశారని చెప్పారు. కేసులో దర్యాప్తు పూర్తిచేసిన సీబీఐ... మార్చి 31న చార్జిషీట్ను కోర్టుకు సమర్పించిందని, సీబీఐ మొదట సమర్పించిన చార్జిషీట్ను కోర్టు ఏప్రిల్ 27న విచారణకు స్వీకరించి సీసీ నం.8ని కేటాయించిందని తెలిపారు. 28న జగన్తో సహా నిందితులుగా ఉన్న 12 మందిని హాజరుకావాలని కోర్టు సమన్లు జారీచేసిందని చెప్పారు. ఈ క్రమంలోనే ఆగమేఘాల మీద సీబీఐ ఈనెల 22న జగన్కు నోటీసులు జారీచేసిందని, 25న ఉదయం 10.30కి తన ఎదుట హాజరు కావాలని ఆదేశించిందని తెలిపారు. ‘‘జగన్కు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. అందుకని ఆ 18 స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అక్కడ తమ అభ్యర్థుల్ని గెలిపించుకోవటానికి ఆయన ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. అందుకని ఈ సమయంలో రాలేనని, జూన్ 15 తర్వాత ఎప్పుడైనా విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని జగన్ కోరినా సీబీఐ అధికారులు నిరాకరించారు’’ అని సుశీల్ వివరించారు.
సుశీల్కుమార్ వాదనల్లోని ముఖ్యాంశాలివీ....
* సీఆర్పీసీ 41 కింద సీబీఐకి ఉన్న అధికారాల్ని వారు దుర్వినియోగం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో జగన్ పాల్గొనకుండా ఉండేందుకే సీబీఐ నోటీసులిచ్చింది. జగన్ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవడమే సీబీఐ లక్ష్యం.
* అరెస్టుకేమీ జగన్ భయపడటం లేదు. కానీ జూన్ 12న ఎన్నికలు. ప్రచారం కీలక దశలో ఉంది. ఇంతలోనే ఏమైంది? 9 నెలలు మౌనంగా ఉన్న సీబీఐకి ఇంత అర్జెంటుగా విచారించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన్ను అరెస్టు చేసి రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే తన ఎదుట హాజరు కావాలని అడిగినట్లుగా భావించాల్సి వస్తోంది. అందుకే ముందస్తు బెయిలు అడుగుతున్నాం.
* జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. పార్లమెంట్ సభ్యుడు. గౌరవప్రదమైన హోదాలో ఉన్నారు. నిత్యం ప్రజల్లో ఉన్నారు. ఎక్కడికీ పారిపోయే అవకాశం లేదు. జగన్కు నోటీసులు జారీచేయడం వెనుక ఏదో శక్తి పనిచేస్తోంది.
* దర్యాప్తు ముగించిన సీబీఐ.. కోర్టుకు చార్జిషీట్ సమర్పించింది. ఈ చార్జిషీట్ను కోర్టు విచారణకు స్వీకరించి జగన్ సహా 12 మంది నిందితులకు సమన్లు జారీచేసింది. నాన్ బెయిలబుల్ కేసుల్లో అవసరమని భావిస్తే కోర్టు వారంట్లు జారీచేయవచ్చు. కానీ ఈ కేసులో న్యాయమూర్తి తన విచక్షణాధికారం మేరకు వారంట్లు ఇవ్వకుండా సమన్లు మాత్రమే ఇచ్చారు.
* 9 నెలల కాలంలో దర్యాప్తును అడ్డుకున్నారనే చిన్న ఫిర్యాదు కూడా జగన్ మీద లేదు. ఆయన వ్యక్తిత్వాన్ని పరిశీలించండి. సాక్షులను బెదిరించారని గానీ, ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నించారని గానీ సీబీఐ ఈ 9 నెలల్లో ఆరోపించనే లేదు. జగన్ తన వ్యక్తిగత స్వేచ్ఛను దుర్వినియోగం చేయలేదు.
* ఈ కేసులో రెండో నిందితునిగా ఉన్న విజయసాయిరెడ్డిని సీబీఐ 30 సార్లు 300 గంటలపాటు విచారించి జనవరి 2న అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది.
న్యాయవాదుల మధ్య వాగ్వివాదం
ఈ నేపథ్యంలో సీబీఐ వాదనలు ప్రారంభించేందుకు ప్రయత్నించింది. తాత్కాలిక ముందస్తు బెయిల్ పిటిషన్పై సీబీఐ వాదనలు వినాల్సిన అవసరం లేదని సుశీల్కుమార్ స్పష్టం చేశారు. ‘ఇది పెద్ద ఫ్రాడ్’ అని సీబీఐ పీపీలు అనగా... సీబీఐనే పెద్ద దగా సంస్థ అంటూ సుశీల్ వ్యాఖ్యానించారు. అసలు శుక్రవారానికి, సోమవారానికి మధ్య ఉన్న తేడా ఏంటి ? అరెస్టు చేయబోమని సీబీఐ స్పష్టం చేస్తే విచారణకు హాజరయ్యేందుకు మాకు అభ్యంతరం లేదని చెప్పారు. ఈ సమయంలో సీబీఐ పీపీలకు, జగన్ తరఫు న్యాయవాదులకు మధ్య స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది.
0 comments:
Post a Comment