వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోకపోతే మానవహక్కుల సంఘం(హెచ్ ఆర్ సి)ని ఆశ్రయిస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్దన్ పోలీసులను హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గాంధేయ పద్దతిలో తమ పార్టీ నడుస్తుందని చెప్పారు. కిరోసిన్ బాటిల్ తీసుకువెళుతుంటే పెట్రోల్ అని కేసు పెట్టారన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
పోలీసులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. తమ పార్టీ నేతల ఇళ్లకు వెళ్లి ఇంట్లో వారిని బెదిరిస్తున్నారన్నారు. రామ్మోహన్ ని ఇంట్లో నుంచి పోలీసులు పట్టుకువెళ్లారని చెప్పారు. కార్యకర్తలను బెదిరించి, వారిచేత తప్పుడు రిపోర్టులు రాయిస్తున్నారని ఆరోపించారు.
పోలీసులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. తమ పార్టీ నేతల ఇళ్లకు వెళ్లి ఇంట్లో వారిని బెదిరిస్తున్నారన్నారు. రామ్మోహన్ ని ఇంట్లో నుంచి పోలీసులు పట్టుకువెళ్లారని చెప్పారు. కార్యకర్తలను బెదిరించి, వారిచేత తప్పుడు రిపోర్టులు రాయిస్తున్నారని ఆరోపించారు.
0 comments:
Post a Comment