'బొత్స, చిరు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'బొత్స, చిరు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి'

'బొత్స, చిరు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి'

Written By news on Friday, May 18, 2012 | 5/18/2012

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జనక్ ప్రసాద్ హెచ్చరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. భాష మంచిగా మాట్లాడండని హితవు పలికారు. అవినీతి చేసినట్లు రుజువుకాకుండా తమ నేత జగన్మోహన రెడ్డిని ఒక్క మాట అనడానికి వీలులేదన్నారు. ఒకవేళ నోరుజారితే తమ పార్టీ నేతలు, జగన్ అభిమానులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. 26 జిఓల గురించి మాట్లాడరెందుకని ఆయన ప్రశ్నించారు. నిర్ణయాలు తీసుకునే సమయంలో ఒక్క మంత్రి మండలి సమావేశంలోనైనా వ్యతిరేకంగా మాట్లాడారా? అని అడిగారు. ఆ నాడు జిఓలు జారీ చేసేటప్పుడు వ్యతిరేకత తెలుపకుండా ఈరోజు ఏ సంబంధంలేని జగన్ పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
Share this article :

0 comments: