వైఎస్ జగన్మోహన్రెడ్డి అరెస్టు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న కాంగ్రెస్ వ్యాఖ్యను బీజేపీ తప్పుబట్టింది. వివాదాస్పద జీవోలతో సంబంధమున్న ఎనిమిది మంది రాష్ట్ర మంత్రుల విషయంలో చట్టం ఎందుకు పని చేయడం లేదని సూటిగా ప్రశ్నించింది. వారిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూడీ సోమవారం దుయ్యబట్టారు.
‘‘కిరణ్ ప్రభుత్వంలోని ఎనిమిది మంది మంత్రులకు వివాదాస్పద జీవోలతో సంబంధముంది. వారిలో కొందరికి సుప్రీంకోర్టు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అందులో ఒక్క మంత్రిని మాత్రమే విచారించి అరెస్టు చేశారు. సబిత, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులను మాత్రం కనీసం విచారించలేదు. ఈ మంత్రుల విషయంలో చట్టం ఎందుకు పని చేయడం లేదు?’’ అని ఆయన ప్రశ్నించారు.
జగన్ అరెస్టు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జరిగిందేనన్నారు. కాంగ్రెస్ను జగన్ దెబ్బ తీస్తున్నందునే ఆయన్ను బలహీనపరిచేందుకు ఇలాంటి చర్యలకు దిగిందని అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులను దెబ్బ తీసేందుకు సీబీఐని అస్త్రంగా కాంగ్రెస్ మార్చుకుంటోందని ఆయన ఆరోపించారు. జగన్ ఒక్కడే లక్ష్యంగా సాగుతున్న సీబీఐ దర్యాప్తు తీరును బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు.
‘‘కిరణ్ ప్రభుత్వంలోని ఎనిమిది మంది మంత్రులకు వివాదాస్పద జీవోలతో సంబంధముంది. వారిలో కొందరికి సుప్రీంకోర్టు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అందులో ఒక్క మంత్రిని మాత్రమే విచారించి అరెస్టు చేశారు. సబిత, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులను మాత్రం కనీసం విచారించలేదు. ఈ మంత్రుల విషయంలో చట్టం ఎందుకు పని చేయడం లేదు?’’ అని ఆయన ప్రశ్నించారు.
జగన్ అరెస్టు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జరిగిందేనన్నారు. కాంగ్రెస్ను జగన్ దెబ్బ తీస్తున్నందునే ఆయన్ను బలహీనపరిచేందుకు ఇలాంటి చర్యలకు దిగిందని అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులను దెబ్బ తీసేందుకు సీబీఐని అస్త్రంగా కాంగ్రెస్ మార్చుకుంటోందని ఆయన ఆరోపించారు. జగన్ ఒక్కడే లక్ష్యంగా సాగుతున్న సీబీఐ దర్యాప్తు తీరును బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు.
0 comments:
Post a Comment