తాయిలాలకు తెర తీసిన టీడీపీ
క్యాడర్కు పంచేందుకు 90 బైకులు సిద్ధం
షోరూం నుంచి స్వాధీనం చేసుకున్న పోలీసులు
కందుకూరు (ప్రకాశం), న్యూస్లైన్: ఉప ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులను కాపాడుకునేందుకు టీడీపీ నానా పాట్లు పడుతోంది. దీనిలో భాగంగా నెల్లూరు పార్లమెంటు స్థానం పరిధిలోని కందుకూరు నియోజకవర్గంలో వారు మోటారు సైకిళ్లను కొనుగోలు చేశారు. త్వరలో వాటిని కార్యకర్తలకు పంచాలని నిర్ణయించారు. ఇందుకోసం దాచిన 90 టీవీఎస్ స్పోర్ట్స్ మోటార్ సైకిళ్లను పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. స్థానిక హీరో షోరూంలో వాటిని టీడీపీనేతలు దాచారన్న సమాచారంతోనే దానిపై దాడి చేసినట్టు కందుకూరు సీఐ అక్కేశ్వరరావు వివరించారు. ‘‘ఉప ఎన్నికల్లో యువతను ప్రభావితం చేసేందుకు టీడీపీ నేతలు మోటారుసైకిళ్లను కొనుగోలు చేసినట్టు కందుకూరు తహసీల్దార్కు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు షోరూంపై దాడి చేసి రికార్డులు పరిశీలించాం. హైదరాబాద్కు చెందిన దివీస్ ఇన్ఫో టెక్ పేరుతో తెలుగు యువత రాష్ట్ర మాజీ కార్యదర్శి దివి శ్రీనివాసులనాయుడు ఈ వాహనాలను కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో తేలింది’’ అని సీఐ వివరించారు. బైకులన్నీ పసుపు రంగులో ఉన్నాయి. చీరాలలోని టీవీఎస్ షోరూంలో వీటిని కొన్నట్టు రికార్డుల ద్వారా తేలింది. టీడీపీ కార్యకర్తలకు పంచేందుకే వీటిని కొన్నట్టు తమ దృష్టికి వచ్చిందని తహ సీల్దార్ వి.రఘురామ్ చెప్పారు. షోరూం డీలర్పై కేసు నమోదు చేశారు.
0 comments:
Post a Comment