వేల ఎకరాలు ఆక్రమించిన రామోజీ దావూద్లా కనిపించడంలేదా?
బియ్యం స్మగ్లింగ్ చేసిన రాధాకృష్ణ పత్రికెలా పెట్టారు?
హైదరాబాద్, న్యూస్లైన్: సూట్కేసులు మోసి పదవి పొందిన కిరణ్కుమార్రెడ్డికి, తిరుపతి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలను గాలికి వదిలేసిన చిరంజీవికి... మాటకు కట్టుబడిన జగన్ను విమర్శించే అర్హత లేదని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్ధన్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పదవి దక్కించుకునేందుకు 45 సార్లు ఢిల్లీకి వయా చెన్నై, బెంగళూరు మీదుగా సూట్కేసులు మోసుకెళ్లారని కిరణ్ను ఉద్దేశించి ఆయన మంత్రివర్గంలోని మంత్రి డి.ఎల్.రవీంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకోవాలని సూచించారు. జగన్ స్వార్థం వల్లే ఉప ఎన్నికలు వచ్చాయని సీఎం కిరణ్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ.. రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, మహిళలు ప్రతి ఒక్కరూ సమస్యలతో సతమతమవుతుంటే... సీఎం కిరణ్ మాత్రం ప్రతిపక్ష చంద్రబాబుతో కలిసి జగన్ను రాజకీయంగా ఏవి ధంగా అణచాలని కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుతో జగన్ కుమ్మక్కయారని కిరణ్ చెప్పడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ అనే మూడో వ్యక్తిని లేకుండా చేయడానికి కాంగ్రెస్, టీడీపీ నేతలు కలిసి కోర్టుమెట్లెక్కిన వైనం తెలుగు ప్రజలకు గుర్తుందన్నారు.
జగన్కు ఓటేస్తే క్రిమినల్కు వేసినట్లని సీఎం కిరణ్, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను బాజిరెడ్డి ఖండించారు. ‘‘జగన్ ఏమైనా ఆయుధం పట్టుకొని తిరుగుతున్నారా? ఆయన అనునిత్యం రోజులో 20 గంటలు ప్రజల మధ్యే గడుపుతున్నారు. ప్రజల్లో తిరగలేక బాబు, కిరణ్ ఇద్దరూ కుమ్మక్కై జగన్ను ఏ విధంగా అప్రతిష్ట పాల్జేయాలనే ఆలోచన చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. సీఎం కిరణ్కు కళ్లు తెరిచినా మూసినా... కలలో కూడా సోనియా కాళ్లు గుర్తుకొస్తున్నాయని ఎద్దేవా చేశారు.
రామోజీ, రాధాకృష్ణల బతుకేంటి?: టీడీపీ నేతలకు మదమెక్కి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను గజదొంగలతో, జర్నలిస్టులను దావూద్ ఇబ్రహీంతో పోలుస్తున్నారని బాజిరెడ్డి దుయ్యబట్టారు. పచ్చళ్లు అమ్మి వేల ఎకరాలు సంపాదించిన, అనేక రాష్ట్రాల్లో మీడియా చానళ్లు పెట్టిన రామోజీ.. దావూద్లా కనిపించడం లేదా? అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. సైకిల్ తొక్కుతూ పక్క రాష్ట్రాలకు బియ్యం స్మగ్లింగ్ చేసిన రాధాకృష్ణ పేపర్, చానల్ ఎలా పెట్టగలిగారని నిలదీశారు. రామోజీ, రాధాకృష్ణల బతుకులు టీడీపీ నేతలకు కనిపించడం లేదా? అని మం డిపడ్డారు. సాక్షి ఖాతాలను ఫ్రీజ్ చేసే అధికారం సీబీఐకి ఎక్కడిదని ప్రశ్నించారు. న్యాయస్థానాల మాదిరిగా సీబీఐ తనకు తానే తీర్పు నిస్తుందా? అని నిలదీశారు. ‘‘సాక్షిలో పెట్టుబడి పెట్టిన వారు దొంగలో, లేదా అది బ్లాక్మనీ అయితేనో సీజ్చేసి రికవరీ చేసుకోవచ్చు. కానీ పెట్టుబడులు పెట్టిన వారంతా బడా పారిశ్రామికవేత్తలు. వారంతా నేరుగా షేర్లు కొనుగోలు చేసి పెట్టుబడి పెట్టారు’’ అని తెలిపారు.
బియ్యం స్మగ్లింగ్ చేసిన రాధాకృష్ణ పత్రికెలా పెట్టారు?
హైదరాబాద్, న్యూస్లైన్: సూట్కేసులు మోసి పదవి పొందిన కిరణ్కుమార్రెడ్డికి, తిరుపతి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలను గాలికి వదిలేసిన చిరంజీవికి... మాటకు కట్టుబడిన జగన్ను విమర్శించే అర్హత లేదని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్ధన్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పదవి దక్కించుకునేందుకు 45 సార్లు ఢిల్లీకి వయా చెన్నై, బెంగళూరు మీదుగా సూట్కేసులు మోసుకెళ్లారని కిరణ్ను ఉద్దేశించి ఆయన మంత్రివర్గంలోని మంత్రి డి.ఎల్.రవీంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకోవాలని సూచించారు. జగన్ స్వార్థం వల్లే ఉప ఎన్నికలు వచ్చాయని సీఎం కిరణ్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ.. రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, మహిళలు ప్రతి ఒక్కరూ సమస్యలతో సతమతమవుతుంటే... సీఎం కిరణ్ మాత్రం ప్రతిపక్ష చంద్రబాబుతో కలిసి జగన్ను రాజకీయంగా ఏవి ధంగా అణచాలని కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుతో జగన్ కుమ్మక్కయారని కిరణ్ చెప్పడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ అనే మూడో వ్యక్తిని లేకుండా చేయడానికి కాంగ్రెస్, టీడీపీ నేతలు కలిసి కోర్టుమెట్లెక్కిన వైనం తెలుగు ప్రజలకు గుర్తుందన్నారు.
జగన్కు ఓటేస్తే క్రిమినల్కు వేసినట్లని సీఎం కిరణ్, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను బాజిరెడ్డి ఖండించారు. ‘‘జగన్ ఏమైనా ఆయుధం పట్టుకొని తిరుగుతున్నారా? ఆయన అనునిత్యం రోజులో 20 గంటలు ప్రజల మధ్యే గడుపుతున్నారు. ప్రజల్లో తిరగలేక బాబు, కిరణ్ ఇద్దరూ కుమ్మక్కై జగన్ను ఏ విధంగా అప్రతిష్ట పాల్జేయాలనే ఆలోచన చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. సీఎం కిరణ్కు కళ్లు తెరిచినా మూసినా... కలలో కూడా సోనియా కాళ్లు గుర్తుకొస్తున్నాయని ఎద్దేవా చేశారు.
రామోజీ, రాధాకృష్ణల బతుకేంటి?: టీడీపీ నేతలకు మదమెక్కి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను గజదొంగలతో, జర్నలిస్టులను దావూద్ ఇబ్రహీంతో పోలుస్తున్నారని బాజిరెడ్డి దుయ్యబట్టారు. పచ్చళ్లు అమ్మి వేల ఎకరాలు సంపాదించిన, అనేక రాష్ట్రాల్లో మీడియా చానళ్లు పెట్టిన రామోజీ.. దావూద్లా కనిపించడం లేదా? అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. సైకిల్ తొక్కుతూ పక్క రాష్ట్రాలకు బియ్యం స్మగ్లింగ్ చేసిన రాధాకృష్ణ పేపర్, చానల్ ఎలా పెట్టగలిగారని నిలదీశారు. రామోజీ, రాధాకృష్ణల బతుకులు టీడీపీ నేతలకు కనిపించడం లేదా? అని మం డిపడ్డారు. సాక్షి ఖాతాలను ఫ్రీజ్ చేసే అధికారం సీబీఐకి ఎక్కడిదని ప్రశ్నించారు. న్యాయస్థానాల మాదిరిగా సీబీఐ తనకు తానే తీర్పు నిస్తుందా? అని నిలదీశారు. ‘‘సాక్షిలో పెట్టుబడి పెట్టిన వారు దొంగలో, లేదా అది బ్లాక్మనీ అయితేనో సీజ్చేసి రికవరీ చేసుకోవచ్చు. కానీ పెట్టుబడులు పెట్టిన వారంతా బడా పారిశ్రామికవేత్తలు. వారంతా నేరుగా షేర్లు కొనుగోలు చేసి పెట్టుబడి పెట్టారు’’ అని తెలిపారు.
0 comments:
Post a Comment