‘సాక్షి’ దినపత్రికకు ప్రకటనలు నిలిపివేస్తూ జీవో జారీచేయడం కక్షసాధింపేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విచారణ పేరిట సంస్థలను మూసివేసేందుకు శోధనాసంస్థలు ప్రయత్నించడం తప్పన్నారు. ఉద్యోగుల ఉపాధి పోవడానికి సీబీఐ కారణమైతే ఆ విచారణ ఆపేయడం మంచిదన్నారు. ఉద్యోగుల ఉపాధికి ప్రభుత్వం, సీబీఐ గ్యారెంటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అడ్వర్టైజ్మెంట్లను ఆపడం పత్రికా స్వేచ్ఛకు భంగమేనని వ్యాఖ్యానించారు.
Home »
» ప్రకటనల నిలిపివేత కక్షసాధింపే: రాఘవులు
ప్రకటనల నిలిపివేత కక్షసాధింపే: రాఘవులు
Written By news on Saturday, May 12, 2012 | 5/12/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment