ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి మహీధర్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసీని కోరింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్ శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ను కలిసి ఈమేరకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు లోక్సభ నియోజకవర్గం కందుకూరు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని మాచవరం గ్రామంలో ఓటర్లకు ‘దీపం’ కనెక్షన్లు పంపిణీ చేశారని ఈసీ దృష్టికి తెచ్చారు. అనంతరం జనక్ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ... అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఓటర్లను కొనుగోలు చేసేందుకు కోడ్ను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. ఒకవైపు కాంగ్రెస్ సర్కారు ఎన్నికల తాయిలాలు ప్రకటిస్తుండగా.., మరోవైపు టీడీపీ పసుపు రంగు మోటారు సైకిళ్లు పంపిణీ చేస్తోందని దుయ్యబట్టారు.
Home »
» మంత్రి మహీధర్పై ఈసీకి ఫిర్యాదు
మంత్రి మహీధర్పై ఈసీకి ఫిర్యాదు
Written By news on Saturday, May 5, 2012 | 5/05/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment