వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంఘీభావం తెలిపిన ఏలూరు ఎమ్మెల్యే ఏకే శ్రీనివాస్(ఆళ్ల నాని), బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీఎస్కే రంగారావులకు పీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సోమవారం గాంధీభవన్లో కంతేటి సత్యనారాయణరాజు అధ్యక్షతన పీసీసీ క్రమశిక్షణా సంఘం సమావేశమైంది. తొలుత ఆళ్లనానికి షోకాజ్ ఇచ్చే అంశంపై చర్చించింది. అనంతరం కంతేటి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన ఆళ్ల నానికి షోకాజ్ నోటీసు పంపినట్లు తెలిపారు. జూన్ 4లోపు స్వయంగా వచ్చి లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీఎస్కే రంగారావు కేసును పీసీసీ అధ్యక్షుడు తమకు సిఫారసు చేయలేదని, అందుకే ఆయనకు నోటీసు జారీ చేయలేదని వివరించారు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో కంతేటి సమావేశమై రంగారావు అంశాన్ని చర్చించారు. రంగారావుకు కూడా నోటీసులిచ్చే అంశాన్ని పరిశీలించాలని బొత్స సూచించడంతో మళ్లీ సమావేశమైన పీసీసీ క్రమశిక్షణా సంఘం.. జూన్ 4లోపు రంగారావు కూడా స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జగన్ వెంట ఉన్న అనకాపల్లి ఎంపీ సబ్బంహరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అంశం ఏఐసీసీ పరిధిలోనిదని కంతేటి తెలిపారు. ఏఐసీసీ ఆదేశిస్తే ఆయనకూ నోటీసులిచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు
బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీఎస్కే రంగారావు కేసును పీసీసీ అధ్యక్షుడు తమకు సిఫారసు చేయలేదని, అందుకే ఆయనకు నోటీసు జారీ చేయలేదని వివరించారు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో కంతేటి సమావేశమై రంగారావు అంశాన్ని చర్చించారు. రంగారావుకు కూడా నోటీసులిచ్చే అంశాన్ని పరిశీలించాలని బొత్స సూచించడంతో మళ్లీ సమావేశమైన పీసీసీ క్రమశిక్షణా సంఘం.. జూన్ 4లోపు రంగారావు కూడా స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జగన్ వెంట ఉన్న అనకాపల్లి ఎంపీ సబ్బంహరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అంశం ఏఐసీసీ పరిధిలోనిదని కంతేటి తెలిపారు. ఏఐసీసీ ఆదేశిస్తే ఆయనకూ నోటీసులిచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు
0 comments:
Post a Comment