జనం ప్రేమ ముందు కుట్రలు నిలబడవు' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జనం ప్రేమ ముందు కుట్రలు నిలబడవు'

జనం ప్రేమ ముందు కుట్రలు నిలబడవు'

Written By news on Wednesday, May 30, 2012 | 5/30/2012

మహానేత వైఎస్‌ఆర్‌ పేరును ఎలాగైతే అప్రతిష్ట పాల్జేసే కుట్ర జరిగిందో.... జగన్‌ విషయంలోనూ అదే జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ అన్నారు. అశేష జనవాహిని సాక్షిగా నర్సన్నపేటలో ఆమె బుధవారం ఉపఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 

జనం ప్రేమ ముందు కాంగ్రెస్‌, టీడీపీ చేస్తున్న కుట్రలు నిలబడవని విజయమ్మ అన్నారు. పేదలు, రైతులు, రైతు కూలీల సంక్షేమం కోసం మహానేత ప్రవేశపెట్టిన పథకాలకు తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు రాజకీయాన్ని మార్చేవని విజయమ్మ అన్నారు.


శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ప్రచారం కొనసాగుతోంది. ఉప ఎన్నికల ప్రచారంలో జగన్ సోదరి షర్మిల కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...'జగనన్నను అన్యాయంగా అరెస్ట్ చేశారు. మా కన్నీటిని చూసి నవ్వుతున్నవారికి గుణపాఠం చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటువేసి కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పండి' అని పిలుపునిచ్చారు. మళ్లీ రాజన్న రాజ్యాన్ని తెచ్చుకోవాలని... జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలని షర్మిల కోరారు.
Share this article :

0 comments: