లొంగదీసుకోవాలనే.. జగన్‌పై సర్కార్ కుట్రలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లొంగదీసుకోవాలనే.. జగన్‌పై సర్కార్ కుట్రలు

లొంగదీసుకోవాలనే.. జగన్‌పై సర్కార్ కుట్రలు

Written By news on Sunday, May 27, 2012 | 5/27/2012


వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డిని లొంగదీసుకోవాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుట్రలు చేస్తోందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వీరయ్య ఆరోపించారు. ఖమ్మంలో శనివారం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సమాఖ్య (సీడబ్యూఎఫ్‌ఐ) రాష్ట్ర మహాసభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వైఎస్‌ఆర్ బతికున్నప్పుడు మాట్లాడని మంత్రులు ఇప్పుడు ఆయన పెట్టమంటేనే సంతకం పెట్టామని చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్షహోదాలో ఉన్న చంద్రబాబు పాలక పక్షంతో కుమ్మక్కై స్వపక్షంలా వ్యవహరిస్తోందని అన్నారు. ఇప్పుడు వైఎస్‌ఆర్ లేడు కాబట్టి నిందలన్నీ ఆయన మీదకు నెడితే సరిపోతుందన్న అభిప్రాయంతో మంత్రులున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల మూలంగా ఇసుక సంక్షోభం ఏర్పడి 40 లక్షల కుటుంబాలు వీధిన పడే పరిస్థితి వచ్చిందన్నారు. దీనికి వ్యతిరేకంగా కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలకు రాష్ట్ర నలుమూలల నుంచి 400 మంది ప్రతినిధులు, రేండువేల మందికి పైగా కార్యకర్తలు హాజరయ్యారు. మహాసభకు ముఖ్యఅతిథిగా సీడబ్ల్యూఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు సింగారవేలు, సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఉమామహేశ్వర్‌రావు పాల్గొన్నారు.
Share this article :

0 comments: