కారంపూడి : అస్మదీయులనుకున్నవారికి ఒక న్యాయం .. అదిష్ఠానం వ్యతిరేకులకు ఒక న్యాయం అన్న తీరులో సీబీఐ పనితీరు సాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా కారంపూడిలో జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. తనను ఆశీర్వదించేందుకు వచ్చిన ఆశేష ప్రజానికాన్ని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు.
పేదోడికి లక్షల రూపాయల వైద్యాన్ని ఉచితంగా అందివ్వాలని వైఎస్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే .. ఆ పధకానికి కిరణ్ సర్కారు తూట్లు పొడించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మందికి ఉపాధినందివ్వాలని వైఎస్ఆర్ తపించేవారనిఅందుకోసం భూములను కేటాయించడాన్ని సీబీఐ తప్పుపడుతోందన్నారు.
గోల్ఫ్ కోర్టు కోసం వందల ఎకరాల భూమిని చంద్రబాబు ధారాదత్తం చేస్తే పట్టించుకోకపోవడం వెనుక మర్మమేమిటిని జగన్ సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిని ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ రాకతో కారంపూడి జనసంద్రంగా మారింది. ఆత్మయనేతకు ప్రజలు ఘన స్వాగతం పలికారు.
పేదోడికి లక్షల రూపాయల వైద్యాన్ని ఉచితంగా అందివ్వాలని వైఎస్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే .. ఆ పధకానికి కిరణ్ సర్కారు తూట్లు పొడించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మందికి ఉపాధినందివ్వాలని వైఎస్ఆర్ తపించేవారనిఅందుకోసం భూములను కేటాయించడాన్ని సీబీఐ తప్పుపడుతోందన్నారు.
గోల్ఫ్ కోర్టు కోసం వందల ఎకరాల భూమిని చంద్రబాబు ధారాదత్తం చేస్తే పట్టించుకోకపోవడం వెనుక మర్మమేమిటిని జగన్ సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిని ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ రాకతో కారంపూడి జనసంద్రంగా మారింది. ఆత్మయనేతకు ప్రజలు ఘన స్వాగతం పలికారు.
0 comments:
Post a Comment