కడప, న్యూస్లైన్: జన హోరుతో రైల్వేకోడూరు నియోజకవర్గం హోరెత్తింది. మహానేత తనయుడు వైఎస్ జగన్కు ప్రజలు నీరాజనం పట్టారు. ప్రజల అభిమానానికి పులకించిపోయిన జగన్.. ప్రతి అక్కా చెల్లి, అవ్వాతాతలను ఆత్మీయంగా పలకరించారు. తమ అభిమాన నేతను చూసేందుకు ఎండను సైతం లెక్క చేయకుండా జనం ఎదురుచూశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం పెనగలూరు మండలం కొండూరులో మాజీ ఎమ్మెల్యే ప్రభావతమ్మ నివాసం నుంచి వైఎస్ జగన్ బయలుదేరారు. తిరుణం పల్లి, సిరివరం, ఎన్ఆర్ పురం మీదుగా పెనగలూరుకు చేరుకున్నారు.
అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అక్కడి నుంచి కంబాలకుంట, సింగనమల, ఓబిలి, బెస్తపల్లి మీదుగా చక్రం పేటకు చేరుకున్నారు. అనంతరం మూగవారిపల్లి, ఈటిమారిపురం, కట్టావారిపల్లి, పోళ్లోపల్లి, దేవమాచుపల్లి, గొల్లపల్లె మీదుగా చిట్వేలి చేరుకున్నారు. చిట్వేలికి చేరుకునే సరికి రాత్రి 9. 30 అయింది. మధ్యాహ్నం 3 గంటలకే చిట్వేలికి రావాల్సిన జగన్ ఆరుగంటలు ఆలస్యంగా రాత్రి పొద్దుపోయాక వచ్చినా జనాలు అలాగే నిరీక్షించారు. అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తర్వాత చిట్వేలిలోని అమ్మవారిశాలను సందర్శించారు. అక్కడి నుంచి నేరుగా మాజీ ఎమ్మెల్యే గుంటి ప్రసాద్ ఇంటికి వెళ్లారు.
కొరుముట్లను గెలిపించండి:
ప్రచారంలో ప్రతి పల్లెవాసులను జగన్ తమకు అండగా నిలవాలని కోరారు. ప్రజలు, రైతన్నల కోసం అండగా నిలిచి, వారి కోసం పదవీ త్యాగం చేసిన తాజా మాజీ ఎమ్మెల్యే కొరుముట్లకు సెల్యూట్ చేశారు. కొరుముట్లపై అందరూ చల్లని ఆశీర్వాదాలు చూపి దీవించాలని, ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. చిట్వేలి వైఎస్సార్ సర్కిల్లో జరిగిన ప్రచారం అనంతరం మాజీ ఎమ్మెల్యే గుంటి ప్రసాద్ జగన్ సమక్షంలో వైఎస్సార్ పార్టీలో చేరారు.
నేడు రైల్వేకోడూరులో రోడ్షో
కడప, న్యూస్లైన్ : వైఎస్ జగన్ శుక్రవారం రైల్వేకోడూరులో రోడ్షో నిర్వహించనున్నట్లు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వైఎస్ కొండారెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు రైల్వేకోడూరులో ముస్లిం నాయకులతో జగన్ సమావేశమవుతారు. అనంతరం అమ్మవారిశాల, గంగమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత ఓబులవారిపల్లె మండలంలో పర్యటిస్తారని వైఎస్ కొండారెడ్ది తెలిపారు. 10.30 గంటలకు ఆర్. రాచపల్లె, 11.45కు వై.కోట, 12.15కు సున్నపురాళ్లపల్లె, 12.45కు చెన్నరాజుపోడులో క్షత్రియులతో సమావేశం, మధ్యాహ్నం 1.30 గంటలకు మంగంపేటలో భోజనం, అనంతరం 2.30 కు కొర్లకుంట, 3.00 గంటలకు ముక్కవారిపల్లె, 4.00 గంటలకు ఓబులవారిపల్లె, సాయంత్రం 5.00 గంటలకు రైల్వేకోడూరు రోడ్షోలో వైఎస్ జగన్ పాల్గొంటారన్నారు.
0 comments:
Post a Comment