సాక్షిపై సీబీఐ దాడుల వెనుక అసలు సూత్రధారి రామోజీరావేనని లక్ష్మీపార్వతి అన్నారు. ఆమె గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ రామోజీ సూచనల్ని సీబీఐ పక్కాగా అమలు జరుపుతుందన్నారు. సోనియా, కిరణ్, చంద్రబాబు, రామోజీరావు ఒకటై జగన్ ను వేధిస్తున్నారని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు.
సాక్షిపై దాడి మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందని ఆమె అన్నారు. సీబీఐ...కాంగ్రెస్ కీలుబొమ్మలా వ్యవహరిస్తోందని లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్ కూడా సీబీఐ తీరును తప్పుపట్టారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సాక్షిపై దాడి మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందని ఆమె అన్నారు. సీబీఐ...కాంగ్రెస్ కీలుబొమ్మలా వ్యవహరిస్తోందని లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్ కూడా సీబీఐ తీరును తప్పుపట్టారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.
0 comments:
Post a Comment