వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి కావాలని రైతులు, రైతు కూలీలు, రాష్ట్ర ప్రజలంతా ఎదురుచూస్తున్నారని ఆ పార్టీ నేత, సినీనటుడు గిరిబాబు అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు ఉపఎన్నికల్లో గెలుపు కోసం డబ్బు, మందు విచ్చలవిడిగా ఖర్చుపెట్టినా కనీసం డిపాజిట్లు కూడా దక్కవన్నారు. ఆ రెండు పార్టీలకు అవమానకర ఫలితాలు వస్తాయన్నారు. ఎన్ని అబద్దాలు చెప్పైనా కనీసం 2 లేదా 3 సీట్లు గెలవాలని ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. ఉపఎన్నికల తర్వాత కాంగ్రెస్, టీడీపీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి భారీగా వలసలు ఉంటాయని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి చిదంబరంతో చంద్రబాబు మ్యాచ్ ఫిక్సింగ్ స్పష్టమైందన్నారు. దీంతో టీడీపీ నేతలు ఏలా సర్దిచెప్పుకోవాలో అర్థంకాని స్థితిలో ఉన్నారన్నారు.
Home »
» 'జగన్ సిఎం కావాలని ఎదురుచూస్తున్న ప్రజ'
'జగన్ సిఎం కావాలని ఎదురుచూస్తున్న ప్రజ'
Written By news on Saturday, May 5, 2012 | 5/05/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment